Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Maharashtra Farmer Forced To Sell Kidney Due To Illegal Moneylenders Harassment

Moneylenders Harassment: మరీ ఇంత దారుణమా.. అప్పు తీర్చేందుకు రైతుతో కిడ్ని అమ్మించిన వడ్డీ వ్యాపారులు..

Published Date :December 17, 2025 , 8:02 am
By Devarakonda Srikanth
  • అమానుషంగా వ్యవహరిస్తున్న వడ్డీ వ్యాపారులు
  • అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వ్యాపారులు
  • అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకునే పరిస్థితి తెచ్చిన వ్యాపారులు
Moneylenders Harassment: మరీ ఇంత దారుణమా.. అప్పు తీర్చేందుకు రైతుతో కిడ్ని అమ్మించిన వడ్డీ వ్యాపారులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అప్పులు తీర్చలేకపోయిన రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమ వడ్డీ వ్యాపారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి, చివరికి వాటిని తీర్చేందుకు రైతులు తమ కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి వరకు తీసుకువచ్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు చట్టపరమైన రక్షణతో పాటు తక్షణ ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ కుడే అనే రైతు ఈ దారుణానికి బలయ్యాడు. వ్యవసాయం ద్వారా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో, అదనపు ఆదాయం కోసం పాల వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పెట్టుబడి కోసం పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి రోజుకు రూ.10 వేల వడ్డీకి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే, ఆ అప్పును సకాలంలో తీర్చలేకపోవడంతో వడ్డీ భారం పెరిగి మొత్తం అప్పు రూ.74 లక్షలకు చేరుకుంది.

అతడు కొనుగోలు చేసిన ఆవులు చనిపోవడం, సాగు చేసిన పంటలు నష్టపోవడంతో సదాశివ్ పరిస్థితి మరింత దిగజారిపోయింది. అప్పులు తీర్చలేని స్థితికి చేరుకున్న అతడిని వడ్డీ వ్యాపారులు తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. చేసేదేమీ లేక తన భూమి, ట్రాక్టర్‌తో పాటు ఇంట్లోని విలువైన గృహోపకరణాలను కూడా అమ్మేశాడు. అయినప్పటికీ అప్పు మొత్తం తీరలేదు.

ఈ పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల్లో ఒకరు కిడ్నీ అమ్ముకోవాలని సదాశివ్‌కు అమానుషమైన సలహా ఇచ్చాడు. ఆ మాటలతో మానసికంగా కుంగిపోయిన సదాశివ్, ఒక ఏజెంట్ సహాయంతో ముందుగా కోల్‌కతాకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి కంబోడియాకు తీసుకెళ్లి శస్త్రచికిత్స ద్వారా అతని కిడ్నీని తొలగించారు. కిడ్నీ అమ్మకానికి ప్రతిఫలంగా అతడికి కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఇచ్చారు.

కిడ్నీ అమ్ముకున్నప్పటికీ అప్పులు పూర్తిగా తీరలేదని, దీంతో తాను తీవ్రంగా మోసపోయానని సదాశివ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అతడు వాపోయాడు. న్యాయం జరగకపోవడంతో మానసికంగా, శారీరకంగా తీవ్ర వేదన అనుభవిస్తున్నానని.. తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా మహారాష్ట్ర సచివాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు.

ఈ ఘటన రైతుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రైతులకు చట్టపరమైన భద్రత, ఆర్థిక మద్దతు అందించడం అత్యవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrapur farmer news
  • farmer debt crisis
  • farmer exploitation
  • farmer kidney sold
  • illegal moneylenders India

తాజావార్తలు

  • Raghav chadha: బీజేపీలోకి రాఘవ్ చద్దా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • Bank Scam: ఏం తెలివిరా నాయనా.. బ్యాంక్‌నే బురిడీ కొట్టించారుగా..

  • Tamil Nadu Assembly Elections 2026: బీజేపీ ఇలా చేసిందేంటి?.. అన్నామలైకి బిగ్ షాక్ ఇచ్చిన కమలం పార్టీ..

  • Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో వచ్చేస్తోంది.. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, యాక్టివ్ మ్యాట్రిక్స్ ఫీచర్

ట్రెండింగ్‌

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions