Moneylenders Harassment: మరీ ఇంత దారుణమా.. అప్పు తీర్చేందుకు రైతుతో కిడ్ని అమ్మించిన వడ్డీ వ్యాపారులు..
- అమానుషంగా వ్యవహరిస్తున్న వడ్డీ వ్యాపారులు
- అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వ్యాపారులు
- అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకునే పరిస్థితి తెచ్చిన వ్యాపారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పులు తీర్చలేకపోయిన రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమ వడ్డీ వ్యాపారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి, చివరికి వాటిని తీర్చేందుకు రైతులు తమ కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి వరకు తీసుకువచ్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు చట్టపరమైన రక్షణతో పాటు తక్షణ ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ కుడే అనే రైతు ఈ దారుణానికి బలయ్యాడు. వ్యవసాయం ద్వారా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో, అదనపు ఆదాయం కోసం పాల వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పెట్టుబడి కోసం పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి రోజుకు రూ.10 వేల వడ్డీకి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే, ఆ అప్పును సకాలంలో తీర్చలేకపోవడంతో వడ్డీ భారం పెరిగి మొత్తం అప్పు రూ.74 లక్షలకు చేరుకుంది.
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
అతడు కొనుగోలు చేసిన ఆవులు చనిపోవడం, సాగు చేసిన పంటలు నష్టపోవడంతో సదాశివ్ పరిస్థితి మరింత దిగజారిపోయింది. అప్పులు తీర్చలేని స్థితికి చేరుకున్న అతడిని వడ్డీ వ్యాపారులు తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. చేసేదేమీ లేక తన భూమి, ట్రాక్టర్తో పాటు ఇంట్లోని విలువైన గృహోపకరణాలను కూడా అమ్మేశాడు. అయినప్పటికీ అప్పు మొత్తం తీరలేదు.
ఈ పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల్లో ఒకరు కిడ్నీ అమ్ముకోవాలని సదాశివ్కు అమానుషమైన సలహా ఇచ్చాడు. ఆ మాటలతో మానసికంగా కుంగిపోయిన సదాశివ్, ఒక ఏజెంట్ సహాయంతో ముందుగా కోల్కతాకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి కంబోడియాకు తీసుకెళ్లి శస్త్రచికిత్స ద్వారా అతని కిడ్నీని తొలగించారు. కిడ్నీ అమ్మకానికి ప్రతిఫలంగా అతడికి కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఇచ్చారు.
కిడ్నీ అమ్ముకున్నప్పటికీ అప్పులు పూర్తిగా తీరలేదని, దీంతో తాను తీవ్రంగా మోసపోయానని సదాశివ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అతడు వాపోయాడు. న్యాయం జరగకపోవడంతో మానసికంగా, శారీరకంగా తీవ్ర వేదన అనుభవిస్తున్నానని.. తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా మహారాష్ట్ర సచివాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు.
ఈ ఘటన రైతుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రైతులకు చట్టపరమైన భద్రత, ఆర్థిక మద్దతు అందించడం అత్యవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!