Maharashtra: సీఎం, డిప్యూటీ సీఎంలు ఎన్ని ఓట్లతో గెలిచారంటే..!
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం
- కోప్రి-పచ్పఖాడి స్థానం నుంచి 1,20,717 ఓట్లతో ఏక్నాథ్ షిండే విజయం
- నాగ్పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ విజయం
- బారామతి నుంచి అజిత్ పవార్ లక్షకుపైగా మెజార్టీతో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఊహించని విధంగా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. 288 స్థానాలకు గాను 233 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా కూటమి పక్షాన నిలబడ్డారు. ఇక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ భారీ విజయంతో గెలుపొందారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై కూడా పోటీ నెలకొంది. ఆదివారం బీజేపీ పెద్దలు ముంబై రానున్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చనున్నారు.
ఇది కూడా చదవండి: BSNL Recharge Plan: బంపర్ ఆఫర్.. కేవలం రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ
Also Read
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కోప్రి-పచ్పఖాడి స్థానం నుంచి 1,20,717 ఓట్లతో విజయం సాధించారు. శివసేనలో చీలిక వచ్చిన తర్వాత బీజేపీతో చేతులు కలిపి షిండే సీఎం అయ్యారు. ఫలితాల గురించి షిండే మాట్లాడుతూ మహారాష్ట్ర మహిళలు మరియు రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నాగ్పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విజయం సాధించారు. 39,710 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్ల వినోదరావు గూడాధేపై విజయం సాధించారు. ఇక బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజిత్ పవార్ లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఎన్సీపీ(శరద్పవార్) పార్టీ నుంచి పోటీ చేసిన యోగేంద్రపై విజయం సాధించారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడే యోగేంద్ర. ఇదిలా ఉంటే ఐదు నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజిత్పవార్ సతీమణి సునేత్ర పవార్ ఓటమి పాలయ్యారు. శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలేపై ఓటమి పాలవడం విశేషం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అజిత్ పవార్ విక్టరీ సాధించారు. ఇక బీజేపీ, శివసేన, ఎన్సీపీల కూటమి మహాయుతి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఇది కూడా చదవండి: Helicopter For Bride: వధువును ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ను ఏర్పాటు చేసిన వరుడు
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!