ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం చెందారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆయన మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అజిత్ పవార్ బ్యాగ్రౌండ్ ఇదే..
అజిత్ పవార్.. 22 జూలై 1952లో జన్మించారు. భార్య సునేత్ర పవార్. ఇద్దరు కొడుకులు పార్థ్ పవార్, జే పవార్ ఉన్నారు.
ఏక్నాథ్ షిండే, ఫడ్నవిస్ ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఫడ్నవిస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. పృథ్వీరాజ్ చవాన్ , దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే మంత్రివర్గాల్లో వివిధ ప్రభుత్వాల కింద ఆరు పర్యాయాలు ఈ పదవిలో పనిచేశారు. 2022 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. 1991లో బారామతి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పీవీ.నరసింహారావు కేబినెట్లో రక్షణ మంత్రిగా కూడా పని చేశారు. బారామతి నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
