Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- నాయకులు పొదుపు మంత్రం
- బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- కాలినడకన సచివాలయానికి వెళ్లిన నితేష్ రాణే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు పొదుపు మంత్రం నేర్పిస్తోంది. నిన్నామొన్నటి దాకా హంగు, ఆర్భాటాలతో మెలిగిన నాయకులంతా ఇప్పుడు మధ్యప్రాచ్యం యుద్ధ పుణ్యమా అంటూ పొదుపు మంత్రం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర పెద్దల దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపుపై జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కాన్వాయ్ సగానికి సగం తగ్గిపోయింది. కేంద్రమంత్రులు కూడా బస్సులు, మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో వెళ్తున్నారు.

Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏకంగా బైక్పై ముంబైలోని విధాన్ భవన్కు వెళ్లారు. అందరికీ భిన్నంగా వినూత్నంగా ప్రయత్నించారు. కొత్త శాసన మండలి సభ్యుల ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఫడ్నవిస్ తన అధికారి నివాసం నుంచి మంత్రి శిష్ షెలార్తో కలిసి మోటార్సైకిల్పై ప్రయాణించారు.
ఇదే తరహాలో రాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా ఇంధన పొదుపు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు కాలినడకనే సచివాలయానికి చేరుకున్నారు. బుధవారం సీఎం ఫడ్నవీస్ పలు పొదుపు చర్యలను ప్రకటించారు. మంత్రుల కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను సగానికి తగ్గించడం, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలను రద్దు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా పశ్చిమాసియా దేశాలపై ఆధారపడుతున్నందున ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోడీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. జిల్లాల పర్యటనల సమయంలో మంత్రుల కాన్వాయ్లలో నిర్ణయించిన పరిమితికి మించి వాహనాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలుపై సంబంధిత పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు బాధ్యత వహించనున్నారు. అలాగే వివిధ శాఖలకు కేటాయించిన ప్రభుత్వ వాహనాల వినియోగంపై కూడా కఠిన సమీక్ష చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
On Hon PM @narendramodi Ji’s appeal, here’s my bit towards austerity measures for our Nation 🇮🇳
I appeal everyone to please bring lifestyle changes in every possible way. pic.twitter.com/SbsREExpcr— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 14, 2026
#WATCH | Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis reaches Vidhan Bhavan on a bike for the MLC oath-taking ceremony after PM Narendra Modi’s appeal to reduce fuel Consumption. pic.twitter.com/zHXbxvKpwD
— ANI (@ANI) May 14, 2026
తాజావార్తలు
-
China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
-
Nagarjuna: నాగార్జునకు బర్త్డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
-
Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
-
Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
-
Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!