Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- నాయకులు పొదుపు మంత్రం
- బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- కాలినడకన సచివాలయానికి వెళ్లిన నితేష్ రాణే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు పొదుపు మంత్రం నేర్పిస్తోంది. నిన్నామొన్నటి దాకా హంగు, ఆర్భాటాలతో మెలిగిన నాయకులంతా ఇప్పుడు మధ్యప్రాచ్యం యుద్ధ పుణ్యమా అంటూ పొదుపు మంత్రం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర పెద్దల దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపుపై జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కాన్వాయ్ సగానికి సగం తగ్గిపోయింది. కేంద్రమంత్రులు కూడా బస్సులు, మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో వెళ్తున్నారు.

Also Read
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏకంగా బైక్పై ముంబైలోని విధాన్ భవన్కు వెళ్లారు. అందరికీ భిన్నంగా వినూత్నంగా ప్రయత్నించారు. కొత్త శాసన మండలి సభ్యుల ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఫడ్నవిస్ తన అధికారి నివాసం నుంచి మంత్రి శిష్ షెలార్తో కలిసి మోటార్సైకిల్పై ప్రయాణించారు.
ఇదే తరహాలో రాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా ఇంధన పొదుపు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు కాలినడకనే సచివాలయానికి చేరుకున్నారు. బుధవారం సీఎం ఫడ్నవీస్ పలు పొదుపు చర్యలను ప్రకటించారు. మంత్రుల కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను సగానికి తగ్గించడం, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలను రద్దు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా పశ్చిమాసియా దేశాలపై ఆధారపడుతున్నందున ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోడీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. జిల్లాల పర్యటనల సమయంలో మంత్రుల కాన్వాయ్లలో నిర్ణయించిన పరిమితికి మించి వాహనాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలుపై సంబంధిత పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు బాధ్యత వహించనున్నారు. అలాగే వివిధ శాఖలకు కేటాయించిన ప్రభుత్వ వాహనాల వినియోగంపై కూడా కఠిన సమీక్ష చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
On Hon PM @narendramodi Ji’s appeal, here’s my bit towards austerity measures for our Nation 🇮🇳
I appeal everyone to please bring lifestyle changes in every possible way. pic.twitter.com/SbsREExpcr— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 14, 2026
#WATCH | Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis reaches Vidhan Bhavan on a bike for the MLC oath-taking ceremony after PM Narendra Modi’s appeal to reduce fuel Consumption. pic.twitter.com/zHXbxvKpwD
— ANI (@ANI) May 14, 2026
తాజావార్తలు
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!