Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- నాయకులు పొదుపు మంత్రం
- బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- కాలినడకన సచివాలయానికి వెళ్లిన నితేష్ రాణే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు పొదుపు మంత్రం నేర్పిస్తోంది. నిన్నామొన్నటి దాకా హంగు, ఆర్భాటాలతో మెలిగిన నాయకులంతా ఇప్పుడు మధ్యప్రాచ్యం యుద్ధ పుణ్యమా అంటూ పొదుపు మంత్రం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర పెద్దల దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపుపై జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కాన్వాయ్ సగానికి సగం తగ్గిపోయింది. కేంద్రమంత్రులు కూడా బస్సులు, మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో వెళ్తున్నారు.

Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏకంగా బైక్పై ముంబైలోని విధాన్ భవన్కు వెళ్లారు. అందరికీ భిన్నంగా వినూత్నంగా ప్రయత్నించారు. కొత్త శాసన మండలి సభ్యుల ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఫడ్నవిస్ తన అధికారి నివాసం నుంచి మంత్రి శిష్ షెలార్తో కలిసి మోటార్సైకిల్పై ప్రయాణించారు.
ఇదే తరహాలో రాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా ఇంధన పొదుపు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు కాలినడకనే సచివాలయానికి చేరుకున్నారు. బుధవారం సీఎం ఫడ్నవీస్ పలు పొదుపు చర్యలను ప్రకటించారు. మంత్రుల కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను సగానికి తగ్గించడం, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలను రద్దు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా పశ్చిమాసియా దేశాలపై ఆధారపడుతున్నందున ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోడీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. జిల్లాల పర్యటనల సమయంలో మంత్రుల కాన్వాయ్లలో నిర్ణయించిన పరిమితికి మించి వాహనాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలుపై సంబంధిత పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు బాధ్యత వహించనున్నారు. అలాగే వివిధ శాఖలకు కేటాయించిన ప్రభుత్వ వాహనాల వినియోగంపై కూడా కఠిన సమీక్ష చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
On Hon PM @narendramodi Ji’s appeal, here’s my bit towards austerity measures for our Nation 🇮🇳
I appeal everyone to please bring lifestyle changes in every possible way. pic.twitter.com/SbsREExpcr— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 14, 2026
#WATCH | Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis reaches Vidhan Bhavan on a bike for the MLC oath-taking ceremony after PM Narendra Modi’s appeal to reduce fuel Consumption. pic.twitter.com/zHXbxvKpwD
— ANI (@ANI) May 14, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!