Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- నాయకులు పొదుపు మంత్రం
- బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- కాలినడకన సచివాలయానికి వెళ్లిన నితేష్ రాణే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు పొదుపు మంత్రం నేర్పిస్తోంది. నిన్నామొన్నటి దాకా హంగు, ఆర్భాటాలతో మెలిగిన నాయకులంతా ఇప్పుడు మధ్యప్రాచ్యం యుద్ధ పుణ్యమా అంటూ పొదుపు మంత్రం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర పెద్దల దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపుపై జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కాన్వాయ్ సగానికి సగం తగ్గిపోయింది. కేంద్రమంత్రులు కూడా బస్సులు, మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో వెళ్తున్నారు.

Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏకంగా బైక్పై ముంబైలోని విధాన్ భవన్కు వెళ్లారు. అందరికీ భిన్నంగా వినూత్నంగా ప్రయత్నించారు. కొత్త శాసన మండలి సభ్యుల ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఫడ్నవిస్ తన అధికారి నివాసం నుంచి మంత్రి శిష్ షెలార్తో కలిసి మోటార్సైకిల్పై ప్రయాణించారు.
ఇదే తరహాలో రాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా ఇంధన పొదుపు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు కాలినడకనే సచివాలయానికి చేరుకున్నారు. బుధవారం సీఎం ఫడ్నవీస్ పలు పొదుపు చర్యలను ప్రకటించారు. మంత్రుల కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను సగానికి తగ్గించడం, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలను రద్దు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా పశ్చిమాసియా దేశాలపై ఆధారపడుతున్నందున ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోడీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. జిల్లాల పర్యటనల సమయంలో మంత్రుల కాన్వాయ్లలో నిర్ణయించిన పరిమితికి మించి వాహనాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలుపై సంబంధిత పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు బాధ్యత వహించనున్నారు. అలాగే వివిధ శాఖలకు కేటాయించిన ప్రభుత్వ వాహనాల వినియోగంపై కూడా కఠిన సమీక్ష చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
On Hon PM @narendramodi Ji’s appeal, here’s my bit towards austerity measures for our Nation 🇮🇳
I appeal everyone to please bring lifestyle changes in every possible way. pic.twitter.com/SbsREExpcr— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 14, 2026
#WATCH | Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis reaches Vidhan Bhavan on a bike for the MLC oath-taking ceremony after PM Narendra Modi’s appeal to reduce fuel Consumption. pic.twitter.com/zHXbxvKpwD
— ANI (@ANI) May 14, 2026
తాజావార్తలు
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!