Madhya Pradesh: 4 లీటర్ల పేయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులా.? ఇదేం దోపిడి భయ్యా..
- ఒక గోడ, 4 లీటర్లు పెయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులు..
- మధ్యప్రదేశ్లో సర్కారును మోసం చేసిన కాంట్రాక్టర్..
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిల్స్..
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ నిర్మాణ సంస్థ సర్కారును దోపిడీ చేసే ప్రయత్నం చేసింది. గణితానికి కూడా అంతుచిక్కని విధంగా బిల్లులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన రిసిప్ట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సకండి గ్రామాలో ప్రభుత్వ పాఠశాలలో ఒక గోడకు 4 లీటర్ల పెయింట్ని వేయడానికి 168 మంది వర్కర్లు, 65 మంది మేస్త్రీలను నియమించుకున్నట్లు బిల్లు పెట్టారు. ఒక్క గోడకు ఇంతమంది ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Pakistan: మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకున్న పాక్ ప్రధాని.. భారత్పై లేనిపోని ఆరోపణలు..
Also Read
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు పరిశీలనకు వెళ్లారు. సకండి లోని ఒక పాఠశాలలో కేవలం 4 లీటర్ల ఆయిల్ పెయింట్ వేయడానికి రూ. 1.07 లక్షలు, నిపానియా గ్రామంలో మరో పాఠశాలో 20 లీటర్ల పేయింట్ వేయడానికి రూ. 2.3 లక్షలు విత్ డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సకండిలో గోడకు 168 మంది కార్మికులు, 65 మేస్త్రీలను ఉపయోగించగా, నిపానియాలో 10 కిటికీలు, నాలుగు తలుపులు పెయింట్ చేయడానికి 275 మంది కార్మికులు,150 మంది మేస్త్రీలను నియమించికున్నట్లు పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉంటే, నిజానికి ఈ లెక్కలన్నీ కాగితం పైన మాత్రమే ఉన్నాయి. గోడలపై ఎలాంటి పెయింట్ లేకపోవడం మరో విచిత్రం. ఈ పనిని నిర్వహించిన నిర్మాణ సంస్థ సుధాకర్ కన్స్ట్రక్షన్ మే 5, 2025లో ఒక బిల్లును రూపొందించింది. దీనిని ఒక నెల ముందు ఏప్రిల్ 4న నిపానియా స్కూల్ ప్రిన్సిపాల్ ధ్రువీకరించడం గమనార్హం. పనికి సంబంధించిన ఫోటోలు లేకుందడా, కేవలం బిల్లుల ద్వారానే డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ రెండు స్కూల్ బిల్లులు వైరల్ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!