Madhya Pradesh: 4 లీటర్ల పేయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులా.? ఇదేం దోపిడి భయ్యా..
- ఒక గోడ, 4 లీటర్లు పెయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులు..
- మధ్యప్రదేశ్లో సర్కారును మోసం చేసిన కాంట్రాక్టర్..
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ నిర్మాణ సంస్థ సర్కారును దోపిడీ చేసే ప్రయత్నం చేసింది. గణితానికి కూడా అంతుచిక్కని విధంగా బిల్లులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన రిసిప్ట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సకండి గ్రామాలో ప్రభుత్వ పాఠశాలలో ఒక గోడకు 4 లీటర్ల పెయింట్ని వేయడానికి 168 మంది వర్కర్లు, 65 మంది మేస్త్రీలను నియమించుకున్నట్లు బిల్లు పెట్టారు. ఒక్క గోడకు ఇంతమంది ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Pakistan: మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకున్న పాక్ ప్రధాని.. భారత్పై లేనిపోని ఆరోపణలు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు పరిశీలనకు వెళ్లారు. సకండి లోని ఒక పాఠశాలలో కేవలం 4 లీటర్ల ఆయిల్ పెయింట్ వేయడానికి రూ. 1.07 లక్షలు, నిపానియా గ్రామంలో మరో పాఠశాలో 20 లీటర్ల పేయింట్ వేయడానికి రూ. 2.3 లక్షలు విత్ డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సకండిలో గోడకు 168 మంది కార్మికులు, 65 మేస్త్రీలను ఉపయోగించగా, నిపానియాలో 10 కిటికీలు, నాలుగు తలుపులు పెయింట్ చేయడానికి 275 మంది కార్మికులు,150 మంది మేస్త్రీలను నియమించికున్నట్లు పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉంటే, నిజానికి ఈ లెక్కలన్నీ కాగితం పైన మాత్రమే ఉన్నాయి. గోడలపై ఎలాంటి పెయింట్ లేకపోవడం మరో విచిత్రం. ఈ పనిని నిర్వహించిన నిర్మాణ సంస్థ సుధాకర్ కన్స్ట్రక్షన్ మే 5, 2025లో ఒక బిల్లును రూపొందించింది. దీనిని ఒక నెల ముందు ఏప్రిల్ 4న నిపానియా స్కూల్ ప్రిన్సిపాల్ ధ్రువీకరించడం గమనార్హం. పనికి సంబంధించిన ఫోటోలు లేకుందడా, కేవలం బిల్లుల ద్వారానే డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ రెండు స్కూల్ బిల్లులు వైరల్ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!