Madhya Pradesh: 4 లీటర్ల పేయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులా.? ఇదేం దోపిడి భయ్యా..
- ఒక గోడ, 4 లీటర్లు పెయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులు..
- మధ్యప్రదేశ్లో సర్కారును మోసం చేసిన కాంట్రాక్టర్..
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ నిర్మాణ సంస్థ సర్కారును దోపిడీ చేసే ప్రయత్నం చేసింది. గణితానికి కూడా అంతుచిక్కని విధంగా బిల్లులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన రిసిప్ట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సకండి గ్రామాలో ప్రభుత్వ పాఠశాలలో ఒక గోడకు 4 లీటర్ల పెయింట్ని వేయడానికి 168 మంది వర్కర్లు, 65 మంది మేస్త్రీలను నియమించుకున్నట్లు బిల్లు పెట్టారు. ఒక్క గోడకు ఇంతమంది ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Pakistan: మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకున్న పాక్ ప్రధాని.. భారత్పై లేనిపోని ఆరోపణలు..
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు పరిశీలనకు వెళ్లారు. సకండి లోని ఒక పాఠశాలలో కేవలం 4 లీటర్ల ఆయిల్ పెయింట్ వేయడానికి రూ. 1.07 లక్షలు, నిపానియా గ్రామంలో మరో పాఠశాలో 20 లీటర్ల పేయింట్ వేయడానికి రూ. 2.3 లక్షలు విత్ డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సకండిలో గోడకు 168 మంది కార్మికులు, 65 మేస్త్రీలను ఉపయోగించగా, నిపానియాలో 10 కిటికీలు, నాలుగు తలుపులు పెయింట్ చేయడానికి 275 మంది కార్మికులు,150 మంది మేస్త్రీలను నియమించికున్నట్లు పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉంటే, నిజానికి ఈ లెక్కలన్నీ కాగితం పైన మాత్రమే ఉన్నాయి. గోడలపై ఎలాంటి పెయింట్ లేకపోవడం మరో విచిత్రం. ఈ పనిని నిర్వహించిన నిర్మాణ సంస్థ సుధాకర్ కన్స్ట్రక్షన్ మే 5, 2025లో ఒక బిల్లును రూపొందించింది. దీనిని ఒక నెల ముందు ఏప్రిల్ 4న నిపానియా స్కూల్ ప్రిన్సిపాల్ ధ్రువీకరించడం గమనార్హం. పనికి సంబంధించిన ఫోటోలు లేకుందడా, కేవలం బిల్లుల ద్వారానే డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ రెండు స్కూల్ బిల్లులు వైరల్ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?