Madhya Pradesh: పెళ్లికి ఒప్పుకోనందుకు అమ్మాయిని దారుణంగా పొడిచిన వ్యక్తి.. రోజుల వ్యవధిలో రెండో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh -man stabs young woman for rejecting marriage proposal: జార్ఖండ్ దుమ్కా తరహాలోనే మధ్యప్రదేశ్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే జార్ఖండ్ దుమ్కా మర్డర్ కేసుల దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా ఓ బాలికను కత్తిలో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలోని బంగర్ఢ గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడు బబ్లూ, పెళ్లి చేసుకోవాలని 20 ఏళ్ల యువతి వెంట పడుతున్నాడు. అయితే బబ్లూ పెళ్లి ప్రతిపాదనను సదరు యువతి తిరస్కరించింది. దీంతో ఇంట్లో ఉన్న యువతిని కత్తితో పలుమార్లు పొడిచాడు నిందితుడు.
ప్రస్తుతం ఆసుపత్రిలో బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోనే బబ్లూ తన అక్కను చంపాలని చూడాడని బాధితురాలి చెల్లి వెల్లడించింది. అమ్మనాన్నలు ఊరు వెళ్లడంతో తాను, తన అక్క ఇంట్లో ఒంటరిగా ఉన్నామని.. ఆ సమయంలో బబ్లూ ఇంటిలోకి వచ్చి గదిలో ఉన్న అక్కను కత్తితో పొడిచాడని తెలిపింది. బబ్లూ పక్క గ్రామంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు బబ్లూ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: MP Parvesh Verma: మనీష్ సిసోడియాకు నార్కో టెస్ట్ నిర్వహించాలి
ఇటీవల జార్ఖండ్ దుమ్కాలో జరిగిన యువతి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన ప్రతిపాదనను తిరస్కరిస్తున్న కారణంగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు ఓ వ్యక్తి. 12 వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల అంకిత నిద్రిస్తున్న సమయంలో కిటీకీ నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు షారుక్ అనే వ్యక్తి. గత కొంత కాలంగా బాధిత బాలిక వెంటపడుతున్నాడు షారుఖ్ తన ప్రేమను అంగీకరించకపోయేసరికి ఆమెను హత్య చేయాలని భావించిన షారుఖ్ పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఈ ఘటన ఆగస్టు 23న జరిగింది. చికిత్స పొందుతూ..ఆదివారం మరణించింది.
తాజావార్తలు
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..