Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
- మధ్యప్రదేశ్లో సంచలనంగా మారిన ప్రేమ పెళ్లి..
- మాజీ ఖైదీని వివాహం చేసుకున్న మహిళా జైలర్..
- జైలులోనే ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Marraige: ప్రేమ గుడ్డిది, కులం, మతం , ప్రాంతం అనే భేదాలు లేకుండా ఎవరికైనా ఎప్పుడైనా కలిగొచ్చు. పేద, ధనిక తేడాలను చూడదు. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటనను చూస్తే ఇదంతా నిజం అనిపిస్తుంది. సత్నా జైలులో జరిగిన సంఘటన ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న మహిళా అధికారి, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీని వివాహం చేసుకుంది. ఈ జైలర్, ఖైదీ ప్రేమ కథ ఇప్పుడు వైరల్గా మారింది.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
Also Read
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయిన ఫిరోజా ఖతూన్, వారెంట్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నప్పుడు ధర్మేంద్ర సింగ్ అనే ఖైదీని కలిశారు. ఛతర్పూర్ జిల్లాలోని చాండ్లా నివాసి అయిన ధర్మేంద్ర సింగ్, 2007లో ఒక కౌన్సిలర్ను హత్య చేసి, పూడ్చిపెట్టిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో ధర్మేంద్ర వారెంట్ సంబంధిత పనుల్ని ఫిరోజా చూసే వారు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత, సత్ర్పవర్తన కారణంగా ధర్మేంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. ధర్మేంద్ర నాలుగేళ్ల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. మే 5న ఛతర్పూర్ జిల్లాలోని లవ్కష్ నగర్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఫిరోజా ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. ఆమె కుటుంబం ఈ పెళ్లి పట్ల అసంతృప్తితో ఉండటంతో, ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. సత్నాలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్ బహదూర్ మిశ్రా తన భార్యతో కలిసి ఫిరోజాకు కన్యాదానం చేశారు. ఈ పెళ్లికి బజరంగ్ దళ్ సభ్యులు కూడా హాజరయ్యారు. సత్నా జైలు అధికారులు, సిబ్బంది, ఖైదీలు కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
తాజావార్తలు
-
Yamaha Ethanol Bike: ఇథనాల్తో నడిచే యమహా బైక్ భారత్లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?