Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
- మధ్యప్రదేశ్లో సంచలనంగా మారిన ప్రేమ పెళ్లి..
- మాజీ ఖైదీని వివాహం చేసుకున్న మహిళా జైలర్..
- జైలులోనే ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Marraige: ప్రేమ గుడ్డిది, కులం, మతం , ప్రాంతం అనే భేదాలు లేకుండా ఎవరికైనా ఎప్పుడైనా కలిగొచ్చు. పేద, ధనిక తేడాలను చూడదు. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటనను చూస్తే ఇదంతా నిజం అనిపిస్తుంది. సత్నా జైలులో జరిగిన సంఘటన ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న మహిళా అధికారి, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీని వివాహం చేసుకుంది. ఈ జైలర్, ఖైదీ ప్రేమ కథ ఇప్పుడు వైరల్గా మారింది.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయిన ఫిరోజా ఖతూన్, వారెంట్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నప్పుడు ధర్మేంద్ర సింగ్ అనే ఖైదీని కలిశారు. ఛతర్పూర్ జిల్లాలోని చాండ్లా నివాసి అయిన ధర్మేంద్ర సింగ్, 2007లో ఒక కౌన్సిలర్ను హత్య చేసి, పూడ్చిపెట్టిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో ధర్మేంద్ర వారెంట్ సంబంధిత పనుల్ని ఫిరోజా చూసే వారు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత, సత్ర్పవర్తన కారణంగా ధర్మేంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. ధర్మేంద్ర నాలుగేళ్ల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. మే 5న ఛతర్పూర్ జిల్లాలోని లవ్కష్ నగర్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఫిరోజా ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. ఆమె కుటుంబం ఈ పెళ్లి పట్ల అసంతృప్తితో ఉండటంతో, ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. సత్నాలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్ బహదూర్ మిశ్రా తన భార్యతో కలిసి ఫిరోజాకు కన్యాదానం చేశారు. ఈ పెళ్లికి బజరంగ్ దళ్ సభ్యులు కూడా హాజరయ్యారు. సత్నా జైలు అధికారులు, సిబ్బంది, ఖైదీలు కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
తాజావార్తలు
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?