Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు
- ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- ఆగస్టు 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ను వరదలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. బర్గి డ్యామ్ 13 గేట్లు తెరవడంతో నర్మదా ఉధృతంగా ప్రవహిస్తోంది. రేవాలో 4,000 మందికి పైగా ప్రజలను రక్షించారు. మధ్యప్రదేశ్లోని తూర్పు జిల్లాలైన దిండోరి, పన్నా, రేవా, సత్నా, నర్సింగ్పూర్, ఛతర్పూర్, మౌగంజ్, మైహార్లలో వరదలకు గురయ్యాయి. వర్షాల కారణంగా నర్మదా, మందాకిని, అష్టభుజ నదులు పొంగిపొర్లుతున్నాయి.

Also Read
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
మధ్యప్రదేశ్లోని తూర్పు జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా వరద లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నర్మదా, మందాకిని నదులతో సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. శుక్రవారం కూడా వరదలు కొనసాగాయి. నీరు ప్రవేశిస్తున్న మధ్యప్రదేశ్లోని నివాస ప్రాంతాల్లో యంత్రాంగం సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దిండోరి, పన్నా, రేవా, సత్నా, నర్సింగ్పూర్, ఛతర్పూర్ జిల్లాలు అత్యధిక ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా మైహార్, దిండోరి జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు. దిండోరిలోని అంగన్వాడీ కేంద్రాలను కూడా మూసివేశారు.

రేవా జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. శుక్రవారం నాటికి సుమారు 3,000 మందిని 27 సహాయక శిబిరాలలో ఉంచారు. ఇప్పటివరకు వరదల కారణంగా చిక్కుకుపోయిన 4,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, సహాయక బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలలో మోహరించారు.

మధ్యప్రదేశ్లో ఆగస్టు 25 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించింది. మధ్య -పశ్చిమ-మధ్య ప్రాంతాలలో వర్షపాతం క్రమంగా పెరుగుతుందని పేర్కొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్లో ఈ కాలానికి సాధారణ సగటు వర్షపాతం 675.1 మి.మీ. కాగా.. 599 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది 11 శాతం లోటును సూచిస్తుంది. తూర్పు మధ్యప్రదేశ్లో 11 శాతం, పశ్చిమ మధ్యప్రదేశ్లో 12 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం..ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో నెలకొన్న అల్పపీడనం, రుతుపవన ద్రోణి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
-
Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్చేంజ్.!
-
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
-
Imran Khan: ఇమ్రాన్ఖాన్కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
-
Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!