Loan App: లోన్ యాప్ వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loan App: లోన్ యాప్ వేధింపులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. లోన్ యాప్ ఏజెంట్లు మరీ బరితెగించి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తుండటంతో లోన్ తీసుకున్న బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారు. విద్యార్థులతోపాటు.. ఇతరులు కూడా లోన్ యాప్ వేధింపులకు బలి అవుతున్నారు. లోన్ యాప్ ఏజెంట్లు మహిళలను సైతం వేధింపులకు గురి చేస్తున్నారు. మహిళలు కూడా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. కొందరు మాత్రం ధైర్యం చేసి.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బెంగళూరులో ఇంజనీరింగ్ విద్యార్థి లోన్ యాప్ ఏజెండ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read also: Student Suicide: నా పిల్ల నన్ను మోసం చేసింది.. ‘అమ్మా సారీ’ అంటూ సెల్ఫీ వీడియో..!
Also Read
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
లోన్ యాప్ కారణంగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరు లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజినీరింగ్ విద్యార్థి తేజష్ (22) లోన్ యాప్ ద్వారా రూ.46,000 రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో విఫలం కావడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధింపులకు దిగారు. దీంతో వారి వేధింపులు తాలలేక తేజష్ జీవితం చాలించాడు. మంగళవారం సాయంత్రం జాలహళ్లిలోని హెచ్ఎంటీ లే అవుట్ లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి గోపీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తేజష్ ఏడాదిన్నరగా ఈ లోన్ యాప్ లను వినియోగిస్తున్నట్లు అతడి తండ్రి గోపీనాథ్ తెలిపారు. 20 రోజుల క్రితమే తనకు ఈ విషయం తెలిసిందని.. దీంతో ఈఎంఐ చెల్లించేందుకు కొంత డబ్బు సాయం చేసినట్లు చెప్పాడు. మంగళవారం కళాశాల లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నాడని గోపీనాథ్ పేర్కొన్నాడు. తన కూతుర్ని ట్యూషన్ వద్ద దింపి వచ్చే సరికి జరగరాని ఘోరం జరిగిపోయిందని వాపోయాడు. విగతజీవిగా ఉన్న కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే తేజష్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోపీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తాజా ఘటనతో పోలీసులు నగరంలో పెరుగుతున్న లోన్ యాప్ మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సులభంగా లభించే రుణాల కోసం ప్రజలు ఆశపడి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. అనధికారిక యాప్ లను డౌన్ లోడ్ చేయడం.. తెలియని లింక్ లను యాక్సెస్ చేయడం వంటివి చేయొద్దని పోలీసులు ప్రజలకు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..