Loan App: లోన్ యాప్ వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loan App: లోన్ యాప్ వేధింపులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. లోన్ యాప్ ఏజెంట్లు మరీ బరితెగించి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తుండటంతో లోన్ తీసుకున్న బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారు. విద్యార్థులతోపాటు.. ఇతరులు కూడా లోన్ యాప్ వేధింపులకు బలి అవుతున్నారు. లోన్ యాప్ ఏజెంట్లు మహిళలను సైతం వేధింపులకు గురి చేస్తున్నారు. మహిళలు కూడా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. కొందరు మాత్రం ధైర్యం చేసి.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బెంగళూరులో ఇంజనీరింగ్ విద్యార్థి లోన్ యాప్ ఏజెండ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read also: Student Suicide: నా పిల్ల నన్ను మోసం చేసింది.. ‘అమ్మా సారీ’ అంటూ సెల్ఫీ వీడియో..!
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
లోన్ యాప్ కారణంగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరు లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజినీరింగ్ విద్యార్థి తేజష్ (22) లోన్ యాప్ ద్వారా రూ.46,000 రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో విఫలం కావడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధింపులకు దిగారు. దీంతో వారి వేధింపులు తాలలేక తేజష్ జీవితం చాలించాడు. మంగళవారం సాయంత్రం జాలహళ్లిలోని హెచ్ఎంటీ లే అవుట్ లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి గోపీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తేజష్ ఏడాదిన్నరగా ఈ లోన్ యాప్ లను వినియోగిస్తున్నట్లు అతడి తండ్రి గోపీనాథ్ తెలిపారు. 20 రోజుల క్రితమే తనకు ఈ విషయం తెలిసిందని.. దీంతో ఈఎంఐ చెల్లించేందుకు కొంత డబ్బు సాయం చేసినట్లు చెప్పాడు. మంగళవారం కళాశాల లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నాడని గోపీనాథ్ పేర్కొన్నాడు. తన కూతుర్ని ట్యూషన్ వద్ద దింపి వచ్చే సరికి జరగరాని ఘోరం జరిగిపోయిందని వాపోయాడు. విగతజీవిగా ఉన్న కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే తేజష్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోపీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తాజా ఘటనతో పోలీసులు నగరంలో పెరుగుతున్న లోన్ యాప్ మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సులభంగా లభించే రుణాల కోసం ప్రజలు ఆశపడి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. అనధికారిక యాప్ లను డౌన్ లోడ్ చేయడం.. తెలియని లింక్ లను యాక్సెస్ చేయడం వంటివి చేయొద్దని పోలీసులు ప్రజలకు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!