Pahalgam Terror Attack: పహల్గామ్ దాడుల ప్రధాన సూత్రధారి సైఫుల్లా కసూరి..!
- పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి గుర్తింపు..
- లాష్కరే-ఇ-తోయిబాకు చెందిన టాప్ కమాండర్ సైఫుల్లా కసూరి..
- సైఫుల్లా కసూరి ఆచూకీ కోసం గాలిస్తున్న భారత భద్రతా దళాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే (LET) కమాండర్ సైఫుల్లా కసూరి పేరు బయటకు వచ్చింది. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్కు ఇతడు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కాగా, కసూరి ప్రస్తుతం లష్కరే పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతి, అతడిని మిల్లీ ముస్లీంలీగ్ సంస్థకు అధ్యక్షుడిగా కూడా చెబుతుంటారు. ఇది హఫీజ్ సయీద్కు చెందిన జమాత్ ఉద్ దవాకు రాజకీయ విభాగంగా ఉంది. ఈ జమాత్ విభాగం పంజాబ్ ప్రావిన్స్ సమన్వయ విభాగం కూడా ఈ ఉగ్రవాదే చూస్తున్నాడు. ప్రస్తుతం జేయూడీని అమెరికా విదేశాంగ శాఖ లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా గుర్తించి.. ఉగ్ర ముద్ర వేసింది.
Read Also: Gorantla Madhav: నల్లపాడు పోలీస్ స్టేషన్ కు గోరంట్ల మాధవ్.. విచారించనున్న పోలీసులు..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
అయితే, ఈ దాడిలో ఉగ్రవాదుల బృందానికి నాయకత్వం వహించింది ఆసీఫ్ ఫౌజీగా భద్రతా దళాలు అనుమానిస్తున్నారు. కాగా, లాష్కరే కమాండర్ సైఫుల్లా ప్లాన్ ను టీఆర్ఎఫ్ నాయకుడు ఆసిఫ్ ఫౌజీ అమలు చేసినట్లు గుర్తించారు. పాక్ నుంచి చొరబడ్డ ఉగ్రవాదులు దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో ఆసిఫ్ తో పాటు సులేమాన్ షా, అబూ తాహాలు పాల్గొన్నట్లు గుర్తించారు. ఈ ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులు ముజఫరాబాద్లోని సేఫ్ హౌస్లోకి వెళ్లినట్లు సమాచారం.
Read Also: Jammu Kashmir: కుల్గామ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్..
అయితే, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా కాశ్మీర్ యువతను టీఆర్ఎఫ్ తమ వైపుకు తిప్పుకుంటుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత టీఆర్ఎఫ్ ఏర్పడింది. ఈ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ వెనక ఉండి లాష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఉన్నట్లు భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నాయి. ఈ టీఆర్ఎఫ్ సంస్థను ఉపా చట్టం కింద భారత ప్రభుత్వం నిషేధించింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!