NTV Telugu Site icon

కేర‌ళ‌లో మ‌రో వివాదం: సీఎంను భ‌గవంతునితో పోలుస్తూ…

కేర‌ళ‌లో ఇటీవ‌లే వ‌ల‌న్‌చెరిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.  ఎన్నిక‌ల్లో విజ‌యం త‌రువాత పిన‌ర‌యి విజ‌య‌న్ వ‌ర్గం ఓ పెద్ద హోర్డింగ్‌ల‌ను ఏర్పాటు చేశారు.  విష్ణు ఆల‌యం ఎదుట ఏర్పాటు చేసిన హోర్డింగులో ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.  పిన‌ర‌యి విజ‌య‌న్‌ను భ‌గ‌వంతునితో పోలుస్తూ హోర్డింగులు ఏర్పాటు చేశారు.  పిన‌ర‌యి విజ‌య‌న్ ఫోటోతో పాటుగా కింద భ‌గ‌వంతుడు ఎవ‌ర‌ని మీరు ప్ర‌శ్నిస్తే ఆహారం అందించేవార‌ని చెబుతారు అని రాసి ఉన్న‌ది.  దీనిపై ఎల్డీఎఫ్ స్పందించింది.  ఈ హోర్డింగుల వెనుక త‌మ హ‌స్తం లేద‌ని చెబుతున్నారు.  వీటిని మే నెల‌లో ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో ఏర్పాటు చేశార‌ని విష్ణు ఆల‌యం అధికారులు చెబుతున్నారు.  ప‌ట్ట‌ణంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి హోర్డింగులు ఏర్పాలు చేశార‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు.  దీంతో ఇప్పుడు కేర‌ళ రాష్ట్రంలో ఈ హోర్డింగుల విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.  

Read: సెన్సార్ పూర్తి చేసుకున్న “తిమ్మరుసు”