మెదడును తినే అమీబా వ్యాధి, మెదడు దెబ్బతినేలా చేస్తుంది, కేరళలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల కలిగే ఈ వ్యాధి పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేస్తోంది. . ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ జారీ చేయబడింది . అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ మరణాలలో ఏడు మరణాలు గత నెలలోనే సంభవించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది తీవ్రమైన మెదడు ఇన్ఫెక్షన్, రోగికి సకాలంలో చికిత్స అందకపోతే మరణానికి దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వస్తుంది, ఇది తీవ్రమైన వాపు, మెదడుకు నష్టం కలిగిస్తుంది.
అమీబా అనేది మానవ మెదడుపై దాడి చేసే ఒక చిన్న జీవి. ఇది అనేక జాతులలో ఉంటుంది . నదులు, చెరువులు, మంచినీటి సరస్సులు, నీటి కుంటలు, నీటి గుంటలలో కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ మెదడు జ్వరానికి కారణమవుతుంది, దీనిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అని పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్ మెదడు వాపుకు కారణమవుతుంది. రోగి మూర్ఛలు, తరచుగా మూర్ఛపోవడం ..కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది.. పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ వ్యాధి ప్రాణాంతకం కావచ్చు. అందుకే దీనిని మెదడును తినే అమీబా అని పిలుస్తారు. దీని ప్రారంభ లక్షణాలలో మెడ గట్టిపడటం, తలనొప్పి, వికారం ,వాంతులు ఉంటాయి.
ఈ వ్యాధి వ్యాప్తి కేరళలో భయాందోళనలను సృష్టించింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ తమ నిఘాను పెంచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు అప్పుడప్పుడు నమోదవుతున్నాయని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు. బాధితుల్లో మూడు నెలల శిశువు నుండి 91 ఏళ్ల వృద్ధుడు వరకు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసి, ప్రతి అనుమానిత కేసులను పరీక్షించాలని అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
