KCR: 2004 నుంచి ఆ ఇళ్లే కేసీఆర్ అధికారిక నివాసం.. బీఆర్ఎస్ ఓటమితో ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: రెండు దశాబ్దాలుగా దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్న తుగ్లక్ రోడ్డులోని 3వ నెంబరు ఇంటిని ఖాళీ చేస్తున్నారు. ఢిల్లీలోని తన అధికార నివాసంతో మాజీ సీఎం కేసీఆర్ 20 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. 2004 నుండి ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లోని ఇల్లు అప్పట్లో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పటి నుండి అధికారిక నివాసంగా ఉంది. ఆ తర్వాత సీఎంగా ఉన్న సమయంలో ఆ ఇంటిని అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్తినలోని కేసీఆర్ అధికారిక నివాసాన్ని సిబ్బంది ఖాళీ చేస్తున్నారు.
అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతున్న సమయంలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక భవనాలను ఖాళీ చేయాల్సిందే. ఇప్పటికే పలువురు మంత్రులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారిక భవనాలను ఖాళీ చేస్తున్నారు. క్యాంపు కార్యాలయాల్లోనే తమ సామాగ్రిని తరలిస్తున్నారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ను కూడా కేసీఆర్ ఖాళీ చేయాల్సిందే. ఇప్పటికే ఆయన ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్కి వెళ్లారు. ప్రస్తుతం అక్కడి నుంచే పార్టీ కలాపాలు చూసుకుంటున్నారు.
Also Read
Read also: Cyclone Michuang Updates: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. వేలాది ఎకరాల్లో పంట నష్టం!
రాష్ట్రంలో గెలిచిన తర్వాత కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎం హోదాలో హస్తినకు వచ్చినప్పుడల్లా ఈ ఇంట్లోనే ఉండేవారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజాప్రతినిధి అయినా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి ఒక నెల సమయం ఉంటుంది. కానీ, కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో ఇల్లు పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆ ఇల్లు ఖాళీగా ఉంటే రెండు దశాబ్దాలుగా ఈ ఇంటితో కేసీఆర్కు ఉన్న సంబంధం తెగిపోతుంది. 2004లో టీఆర్ఎస్ తరఫున కరీంనగర్ నుంచి ఎంపీగా ఎన్నికై మన్మోహన్సింగ్ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ పనిచేశారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు తుగ్లక్ రోడ్డులోని టైప్ 8 క్వార్టర్ను కేటాయించింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచి అదే సభలో కొనసాగారు. 2009లో మహబూబ్నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన అదే నివాసంలో ఉంటున్నారు.
2014లో తెలంగాణ సీఎం అయిన కేసీఆర్.. ముఖ్యమంత్రులకు ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్ కు కేటాయించారు. అదే సమయంలో కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఆమె ఆ నివాసాన్ని తన అధికారిక నివాసంగా కూడా ఎంచుకుంది. ఆ క్వార్టర్ ముఖ్యమంత్రి, ఎంపీ కవితకు అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత అదే నివాసంలో కొనసాగారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కవితకు ప్రస్తుతం ఎంపీ పదవి కూడా లేదు. దీంతో ఢిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇల్లు ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా రెండు మూడు రోజులు పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు కేంద్ర ప్రభుత్వ అధికారులకు నివేదించినట్లు సమాచారం.
Dinesh Phadnis Passes Away: సీఐడీ ఫేమ్ నటుడు దినేష్ ఫడ్నిస్ కన్నుమూత
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!