Karnataka: సమ్మెలోకి 6 లక్షల ట్రక్కర్లు.. నిలిచిన నిత్యావసర వస్తువులు
- కర్ణాటకలో సమ్మెలోకి 6 లక్షల ట్రక్కర్లు
- నిలిచిన నిత్యావసర వస్తువులు
- ధరలు పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప.. మిగిలిన అన్ని ట్రక్కులు రోడ్లపైకి రావని రవాణా సంఘాలు తెలిపాయి. నిత్యావసరాలు, నిర్మాణ సామగ్రి, పెట్రోల్, ఎల్పీజీ, ఇతర వస్తువులను రవాణా చేసే ట్రక్కులు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. కర్ణాటక రాష్ట్ర లారీ యజమానులు మరియు ఏజెంట్ల సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఆరు లక్షల మంది ట్రక్కర్లు ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగాయి. ఇంధన ధరల పెరుగుదల, టోల్ ప్లాజాల్లో వేధింపులకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెను ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Vijay sethupathi : స్క్రిప్ట్ నచ్చితే చాలు.. డైరెక్టర్ గురించి పట్టించుకోను
Also Read
- Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
- Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
- Lok Sabha: ఫలించిన స్పీకర్ చొరవ.. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రేపు చర్చ
పాలు రవాణా చేసే ట్రక్కులు తప్ప మిగతా అన్ని ట్రక్కులు రోడ్లపై తిరగవని అసోసియేషన్ తెలిపింది. 24 రాష్ట్రాల నుంచి 60 కి పైగా రవాణా సంఘాలు సమ్మెకు మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు. నిరసన సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి ట్రక్కులు కర్ణాటకలోకి ప్రవేశింపవని పేర్కొంది.
‘‘కర్ణాటక ప్రభుత్వం కేవలం ఏడు నెలల వ్యవధిలో రెండుసార్లు డీజిల్ ధరను పెంచింది. దీని వలన నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ట్రక్కర్లు నడపడానికి ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ ధరల పెరుగుదల కర్ణాటకలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేసింది.’’ అని అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆర్. షణ్ముగప్ప తెలిపారు.
సమ్మె కారణంగా కర్ణాటక నుంచి తమిళనాడుకు రోజుకు 4,000 లోడ్ల కూరగాయలు, బియ్యం, మందులు మరియు ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయాయి. ‘‘కోలార్ మరియు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి కూరగాయల కోసం.. ముఖ్యంగా టమోటాల కోసం ట్రక్కులపై ఎక్కువగా ఆధారపడే చెన్నైకు కష్టాలు తప్పవని షణ్ముగప్ప హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలు..
తమిళనాడులో ప్రస్తుతం టమోటాలు కిలోకు దాదాపు రూ. 25 కు అమ్ముడవుతున్నాయి. సరఫరా నిలిచిపోవడంతో అంతరాయం కలిగి ధరలు అమాంతంగా పెరిగిపోవచ్చు. సమ్మె కారణంగా మహారాష్ట్ర నుంచి వచ్చే ట్రక్కులు.. ముఖ్యంగా నాసిక్ నుంచి ఉల్లిపాయలను తీసుకొచ్చే ట్రక్కులు ఆలస్యం కావడం పట్ల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ప్రతిరోజూ దాదాపు 15,000 ట్రక్కులు కర్ణాటక గుండా వెళుతున్నాయని బెంగళూరు కమర్షియల్ ట్రక్ అసోసియేషన్ రాజేష్ గుర్తించారు.
డిమాండ్లు ఇవే..
ఇక కర్ణాటకలో టోల్ వసూలును రద్దు చేయడం, రాష్ట్ర సరిహద్దుల్లో ఆర్టీవో చెక్పోస్టులను తొలగించడం, ఫిట్నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు రూ. 15,000 వసూలు చేయాలన్న కేంద్రం ఆదేశాన్ని ఉపసంహరించుకోవడం వంటి ఇతర అనేక డిమాండ్లను కూడా అసోసియేషన్ లేవనెత్తింది. బెంగళూరులో ట్రక్కులకు ‘‘నో ఎంట్రీ’’ పరిమితిని సడలించడం కూడా ఒక ముఖ్యమైన డిమాండ్గా ఉంది.
తాజావార్తలు
-
Mega DSC: ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
-
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
-
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
-
Flipkart Freedom Sale 2026: ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!