Priyank kharge: ఆ సర్వే ప్రభుత్వం చేయించలేదు.. బీజేపీ ఆరోపణలు తిప్పికొట్టిన కర్ణాటక మంత్రి
- కర్ణాటకలో దుమారం రేపుతున్న ‘ఎన్నికల సర్వే’ వ్యవహారం
- కాంగ్రెస్ ఎలాంటి సర్వేలు చేయించలేదన్న కర్ణాటక మంత్రి
- బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ప్రియాంక ఖర్గే
కర్ణాటకలో ‘ఎన్నికల సర్వే’ వ్యవహారంపై దుమారం రేపుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా బీజేపీ ఆరోపణలను మంత్రి ప్రియాంక ఖర్గే తోసిపుచ్చారు. మీడియాలో ప్రచారం అవుతున్న ఎన్నికల సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించలేదని పేర్కొన్నారు. ఈవీఎంలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఏ ఏజెన్సీకి ప్రభుత్వం ఆదేశించలేదని.. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తిప్పికొట్టారు. సర్వేల పేరుతో బీజేపీ ఏం చేయాలనుకుంటోందని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Iran: ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ ఎన్నికల సర్వే నిర్వహించింది. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఈవీఎంలపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారని.. 83 శాతం మంది బలమైన విశ్వాసం వ్యక్తపరిచారని పేర్కొంది. అయితే ఈ సర్వేను సిద్ధరామయ్య ప్రభుత్వమే చేయించిందని.. ఇది కాంగ్రెస్కు చెంపదెబ్బలాంటిదని బీజేపీ ఆరోపించింది. అయితే తాజాగా కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఆ సర్వే తాము చేయించలేదని ప్రియాంక ఖర్గే పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US-Russia: పుతిన్ ఇంటిపై ఉక్రెయినే దాడి చేసింది.. అమెరికాకు ఆధారాలు అందించిన రష్యా
డెక్కన్ హెరాల్డ్(ఆంగ్ల పత్రిక) నివేదిక ప్రకారం.. ఈ సర్వేను ప్రధాన ఎన్నికల అధికారి అన్బుకుమార్ చేయించినట్లుగా పేర్కొంది. బెంగళూరు, బెలగావి, కలబురగి, మైసూరు సహా 102 అసెంబ్లీ నియోజకవర్గాలలో 5,100 మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్లుగా తెలిపింది. దాదాపు 83 శాతం మంది ఈవీఎంల ఓటింగ్పై మద్దతు తెలిపినట్లుగా పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?