Priyank kharge: ఆ సర్వే ప్రభుత్వం చేయించలేదు.. బీజేపీ ఆరోపణలు తిప్పికొట్టిన కర్ణాటక మంత్రి
- కర్ణాటకలో దుమారం రేపుతున్న ‘ఎన్నికల సర్వే’ వ్యవహారం
- కాంగ్రెస్ ఎలాంటి సర్వేలు చేయించలేదన్న కర్ణాటక మంత్రి
- బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ప్రియాంక ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ‘ఎన్నికల సర్వే’ వ్యవహారంపై దుమారం రేపుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా బీజేపీ ఆరోపణలను మంత్రి ప్రియాంక ఖర్గే తోసిపుచ్చారు. మీడియాలో ప్రచారం అవుతున్న ఎన్నికల సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించలేదని పేర్కొన్నారు. ఈవీఎంలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఏ ఏజెన్సీకి ప్రభుత్వం ఆదేశించలేదని.. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తిప్పికొట్టారు. సర్వేల పేరుతో బీజేపీ ఏం చేయాలనుకుంటోందని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Iran: ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి
Also Read
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ ఎన్నికల సర్వే నిర్వహించింది. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఈవీఎంలపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారని.. 83 శాతం మంది బలమైన విశ్వాసం వ్యక్తపరిచారని పేర్కొంది. అయితే ఈ సర్వేను సిద్ధరామయ్య ప్రభుత్వమే చేయించిందని.. ఇది కాంగ్రెస్కు చెంపదెబ్బలాంటిదని బీజేపీ ఆరోపించింది. అయితే తాజాగా కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఆ సర్వే తాము చేయించలేదని ప్రియాంక ఖర్గే పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US-Russia: పుతిన్ ఇంటిపై ఉక్రెయినే దాడి చేసింది.. అమెరికాకు ఆధారాలు అందించిన రష్యా
డెక్కన్ హెరాల్డ్(ఆంగ్ల పత్రిక) నివేదిక ప్రకారం.. ఈ సర్వేను ప్రధాన ఎన్నికల అధికారి అన్బుకుమార్ చేయించినట్లుగా పేర్కొంది. బెంగళూరు, బెలగావి, కలబురగి, మైసూరు సహా 102 అసెంబ్లీ నియోజకవర్గాలలో 5,100 మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్లుగా తెలిపింది. దాదాపు 83 శాతం మంది ఈవీఎంల ఓటింగ్పై మద్దతు తెలిపినట్లుగా పేర్కొంది.
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!