Karnataka Minister: “భగవద్గీత”మతపరమైన బుక్ కాదు.. డిసెంబర్ నుంచి పాఠశాలల్లో బోధన
Bhagavad Gita teachings in Karnataka schools from December: డిసెంబర్ నుంచి కర్ణాటక పాఠశాలల్లో కీలక ఘట్టం మొదలుకానుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాల్లలో నైతిక విద్యలో భాగంగా ‘ భగవద్గీత’ను బోధించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే భగద్గీత బోధిస్తే ఖురాన్ ను ఎందుకు బోధించరని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఖురాన్ మతపరమైన గ్రంథమని.. భగవద్గీత మతపరమైన గ్రంథం కాదని.. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు. భగవంతుని ఆరాధన గురించి భగవద్గీతలో ఉండదని.. మతపరమైన ఆచారాలను గురించి భగవద్గీత చెప్పదని.. కేవలం నైతికత గురించి మాత్రమే బోధిస్తుందని ఆయన అన్నారు. ఇది విద్యార్థులకు ప్రేరణ, స్ఫూర్తిని ఇస్తుందని ఆయన అన్నారు.
Read Also: Special Story on Gautam Adani: గౌతమ్ అదానీకి ఇంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా వచ్చింది?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
స్వాతంత్య్ర సమరయోధులు కూడా గీత నుంచి ప్రేరణ పొంది పోరాడారని ఆయన అన్నారు. శాసన మండలిలో ఎంకే ప్రాణేస్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ మంత్రి నగేష్ ఈ వ్యాక్యలు చేశారు. భగవద్గీతను ప్రత్యేక పాఠ్యాంశంగా బోధించాలనే ప్రతిపాదన విరమించుకున్నామని..అయితే అందులోని బోధనలు నైతిక విద్యలో భాగంగా ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ఇప్పటికే నిపుణుల కమిటీని నియమించిందని.. వారి సూచనలు, సిఫార్సుల మేరకు డిసెంబర్ నుంచి పాఠశాలల్లో గీత బోధనలు ప్రారంభం అవుతాయిన ఆయన వెల్లడించారు.
కర్ణాటకలోని స్థానిక రాజులు, రాష్ట్రానికి సంబంధించిన విషాయాలను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. స్థానిక రాజులు, రాజ్యాల పాఠ్యాంశాలను 6 నుంచి 10 తరగతుల సోషల్ స్టడీస్ పాఠ్యాంశాల్లో చేరస్తామని తెలిపారు. గంగా, హోయసలు, మైసూర్ వడియార్, విజయపుర సామ్రాజ్యం, శాతవాహన, కళ్యాని చాళుక్య, బహమనీ, విజయనగరం, సురపుర నాయక, హైదరాలీ-టిప్పు సుల్తాన్, తుళునాడు, యలహంక నాడ ప్రభు, చిత్రదుర్గ వీరులకు సంబంధించిన వీరుల పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. భగవద్గీత పాఠ్యాంశంలో భాగం కానప్పటికీ.. దాని ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాక మంత్రి నగేష్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!