Karnataka: సీఎం సిద్ధరామయ్యకు అవమానం.. రివార్డ్ తిరస్కరించిన ఖో ఖో ప్లేయర్స్
- సీఎం సిద్ధరామయ్యకు అవమానం
- రివార్డ్ తిరస్కరించిన ఖో ఖో ప్లేయర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఏవైనా పతకాలు సాధించినప్పుడు ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహం మరింత ఉత్తేజపరుస్తాయి. ఇలా ఆయా రకాలైన ఆటల్లో చూస్తుంటాం. అలాంటిది కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన బహుమతి విమర్శలకు దారి తీసింది. ఇద్దరు ఆటగాళ్లు నగదు బహుమతిని తిరస్కరించారు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వానికి తీవ్ర అవమానం జరిగినట్లైంది.
ఎంకే. గౌతమ్, చైత్ర బి… ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన పురుషులు, మహిళల జట్లలో భాగంగా ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. అయితే ఈ నగదు అవమానంగా భావించారు. అంతే ప్రభుత్వం ప్రకటించిన రివార్డ్ను క్రీడాకారులిద్దరూ తిరస్కరించారు. అయితే తాము నగదు తిరస్కరించడం వల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అగౌరవపరచడం లేదన్నారు. కానీ మాకు తగిన గౌరవం లభించలేదని గౌతమ్ అన్నారు. మహారాష్ట్రలో తమ ఆటగాళ్లకు మెరుగైన మద్దతు ఇచ్చిందని ఆటగాళ్ళు గుర్తుచేశారు. గౌతమ్తో పాటు చైత్ర కూడా ప్రభుత్వ స్పందన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇతర ప్రపంచకప్ ఆటగాళ్లకు ఇచ్చే మొత్తాన్ని మేం డిమాండ్ చేస్తున్నామని, ఇతర క్రీడాకారుల మాదిరిగానే మనకు కూడా పతకాలు వచ్చాయి. అయితే క్రీడాకారులకు వివిధ ఆటలకు ఇచ్చే సౌకర్యాలను కోల్పోతున్నామని ఆమె అన్నారు.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
ఇది కూడా చదవండి: Vishal : తెలుగు మీడియాని లైట్ తీసుకున్న విశాల్?
ఇదిలా ఉంటే ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన మహారాష్ట్ర క్రీడాకారులకు అక్కడి ప్రభుత్వం రూ.2.25 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అంతేకాకుండా ఉద్యోగాలను కూడా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం.. క్రీడాకారులను ఉన్నతంగా గౌరవిస్తే.. కర్ణాటక ప్రభుత్వం తమను చిన్నచూపు చూసినట్లుగా క్రీడాకారులు భావించారు. దీంతో బహుమతిని తిరస్కరించారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. క్రీడాకారులను సత్కరించి, వారి విజయాలను ప్రశంసించినప్పటికీ.. గౌతమ్, చైత్ర మాత్రం గౌరవం సరిపోదని భావించారు. నగదు బహుమతి తమను క్రీడలో కొనసాగేందుకు ప్రోత్సహించదని, ఖో ఖోను కొనసాగించేందుకు ఇతరులను ప్రేరేపించదని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని క్షుణ్ణంగా సమీక్షించాలని, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎలా జరిగిందో చూసి, ఆపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Thandel Trailer: తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్.. నాగచైతన్య మాస్ ట్రీట్ రెడీ!
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!