843 కోట్లతో గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన కర్ణాటక…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. గ్లోబల్ టెండర్లను పిలవడం ద్వారా రెండు కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ను సేకరించబోతోంది. దీనికోసం 843 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాల్లాగే- కర్ణాటక కూడా కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతోన్నది ఈ రాష్ట్రంలోనే. యాక్టివ్ కేసుల్లో కర్ణాటక.. దేశంలోనే మొదటి స్థానంలో ఉంటోంది
డిమాండ్కు అనుగుణంగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవడం వల్ల గ్లోబల్ టెండర్ల ద్వారా వాటిని సేకరించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రయను వేగవంతం చేసింది. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వర్థ నారాయణ సారథ్యంలో ఏర్పాటైన కోవిడ్ టాస్క్ఫోర్స్.. గ్లోబల్ టెండర్ల ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. నాలుగు విడతల్లో రెండు కోట్ల డోసుల వ్యాక్సిన్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఒక్కో విడతకు 50 లక్షల డోసుల చొప్పున వ్యాక్సిన్లను సమీకరిస్తామని టాస్క్ఫోర్స్ పేర్కొంది. ఇదే గ్లోబల్ టెండర్ల ద్వారా 75 కోట్ల రూపాయలతో అయిదు లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను కడా సేకరించనున్నట్లు వెల్లడించింది.
Also Read
- Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
- Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
- IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
రెండో విడత వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోన్న వారు.. తప్పనిసరిగా 12 వారాల పాటు వేచి ఉండక తప్పదని అశ్వర్థ నారాయణ తెలిపారు. కోవాగ్జిన్ టీకా వేసుకున్న వారికి ఆరు వారాలు, కోవిషీల్డ్ తీసుకున్న వారికి 12 వారాలు వ్యవధి విధించినట్లు పేర్కొన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల్లోపు ఉన్న వారికి వ్యాక్సిన్ అందజేయడంలో ప్రాధాన్యతా క్రమాన్ని రూపొందించుకున్నామని అన్నారు. పోస్టల్, వ్యవసాయ శాఖల్లో పనిచేసే వారు, బ్యాంకు ఉద్యోగులు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, వీధి వ్యాపారులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వారికి అత్యవసరంగా వ్యాక్సిన్లను అందజేయాల్సి అవసరం ఉన్నట్లు టాస్క్ఫోర్స్ గుర్తించిందని చెప్పారు
ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం.. కర్ణాటకలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 41,664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 349 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 21,71,931కి చేరాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఆరు లక్షల మార్క్ను దాటాయి. 6,05,494కు చేరుకున్నాయి. జూన్ 10వ తేదీ నాటికి ఈ సంఖ్య 10 లక్షల మార్క్ను దాటొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
తాజావార్తలు
-
US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!