BJP: విదేశాల్లో భారత్ను కించపరుస్తున్న రాహుల్ గాంధీ.. బీజేపీ నేతల ఆగ్రహం..
- రాహుల్ గాంధీ దేశానికి అవమానకరం..
- కొలంబియాలో రాహుల్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కొలంబియాలోని ఒక యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ.. భారత్లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన అవమానకరమని అన్నారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని అప్రతిష్టపాటు చేయడానికి మరోసారి కాంగ్రెస్ ఎంపీ ప్రయత్నించారని కంగనా ఆరోపించారు.
‘‘అతను ఒక అవమానకరమైన వ్యక్తి. దేశాన్ని విమర్శిస్తూ, ప్రతిచోటా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అందరికీ తెలుసు. ఇక్కడి ప్రజలు గొడవపడేవారని, వారు నిజాయితీపరులు కాదని అతను చెబుతుంటే, దీని ద్వారా అతను భారతీయులు బుద్ధిహీనులు అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు,’’ అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా, సాధారణ ప్రజల్ని కూడా అవమానించడమే అని ఆమె అన్నారు. దేశాన్ని అతను ఎప్పుడూ కించపరుస్తూనే ఉంటాడని, అతడి వ్యాఖ్యలకు దేశం సిగ్గుపడుతుందని ఆమె అన్నారు.
Also Read
- PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
Read Also: Osmania Hospital : ఉస్మానియా కొత్త ఆస్పత్రి భవనం ఎన్ని అంతస్తులో తెలుసా.?
విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. ‘‘భారతదేశంలో జరుగుతున్న ఏకైక అతిపెద్ద ప్రమాదం ప్రజాస్వామ్యంపై దాడి. భారతదేశం వాస్తవానికి దాని ప్రజలందరి మధ్య సంభాషణ… విభిన్న సంప్రదాయాలు, మతాలు, ఆలోచనలకు స్థలం అవసరం. ఆ స్థలాన్ని సృష్టించడానికి ఉత్తమ మార్గం ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రస్తుతం, ప్రజాస్వామ్య వ్యవస్థపై సమూల దాడి జరుగుతోంది. కాబట్టి అది ఒక ప్రమాదం’’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ విదేశాలకు వెళ్లి, అక్కడి నుంచి అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు అని అన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను విదేశాల్లో కించపరచడం ఆయనకు అలవాటుగా మారిందని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
-
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ను బయటపెట్టిన బుచ్చిబాబు!
-
CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!