K. A. Paul: భారతదేశం త్వరలో వెనిజులా , శ్రీలంక కాబోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం త్వరలో వెనిజులా , శ్రీలంక కాబోతోందని కే.ఏ.పాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయంపై బుధవారం రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు. ధర్నాకి అన్ని పార్టీలు మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు. కెసిఆర్, జగన్, పవన్ కళ్యాణ్ ఇతర పార్టీ కి చెందిన నాయకులు ధర్నాకు రావాలని కే.ఏ.పాల్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మా ధర్నాకు మద్దతు పదినిమిషాలు నాతోపాటు కూర్చోవాలని డిమాండ్ చేసారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అంతా హాజరు కావాలని డిమాండ్ చేస్తున్ననని పేర్కొన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ పారాసిటీ మాల్ వేసుకోవాలని చెప్పారు, దాంతో లక్షల మంది చనిపోయారని వివమర్శించారు.
read also: Prabhas Salaar : భయంకరమైన ఒక లోయలో యాక్షన్ సీన్
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బ్రస్ట్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కెసిఆర్ ప్రధాని అవుతాడని విదేశీయులు కుట్రపడ్డారని అందులో భాగంగానే క్లౌడ్ బ్రెస్ట్ జరిగిందనీ కెసిఆర్ కామెంట్స్ చేశాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గులేని కామెంట్స్ చేయడం ఏంటని కే.ఏ.పాల్ అన్నారు. పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల్లో 9 పార్టీలతో జతకలిసాడని ఎద్దేవచేసారు. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు అన్ని పార్టీలతో జత కలిశాడు, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడంటూ సంచలన వ్యాఖ్యాలు చేసారు. పవన్ కళ్యాణ్ ని ఎవరు నమ్మటం లేదు, అందుకోసమే ఒక్క లీడర్ కూడా ఆయన దగ్గర ఉండట్లేదని విమవర్శించారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి నాయకులు పార్టీ విడిచి వెళ్లిపోయారని అన్నారు. తను హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే గుజరాత్ లో పెట్టాలని బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం తను హైదరాబాదులోనే గ్లోబల్ సమ్మిట్ పెడతానంటూ శపథం చేసారు. నేను రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడనని అన్నారు. 8 కోట్ల తెలుగు ప్రజల బాగుకోసం ఎంతకైనా వెళ్తానని అన్నారు. సీఎం కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పులు, జగన్మోహన్ రెడ్డి ఎనిమిది కోట్ల లక్షల అప్పులు చేశారని విమర్శించారు. ఆగస్టు 15 వరకు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కే.ఏ.పాల్ అన్నారు.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!