Joshimath, Neighbouring Areas Sink By 2.5 Inch Every Year: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ పట్టణం కుంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ పట్టణంలో దాదాపుగా 700కు పైగా ఇళ్లు, భవనాలు నెలలోకి కూరుకుపోవడంతో పాటు బీటలువారుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చేవేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ అందర్నీ కలవరపెడుతోంది. జోషిమఠ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉండే పట్టణాలు, గ్రామాలు ప్రతీ సంవత్సరం 2.5 అంగుళాల మేర నెలలోకి కూరుకుపోతున్నట్లు తేలింది. డెహ్రాడూన్ నగరానికి చెందిన ఓ ఇన్స్టిట్యూట్ ఈ ప్రాంతంలోని ఉపగ్రహ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది.
Read Also: Team India: ఆఖరి ఓవర్లో హైడ్రామా.. క్రీడా స్ఫూర్తి చాటుకున్న రోహిత్
హిమాలయ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఆ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలకు ప్రతిబంధకంగా మారింది. భూఅంతర్భాగంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, యూరేషియా టెక్టానిక్ ప్లేట్ ను ఉత్తరం వైపుగా తోస్తోంది. ప్రతీ ఏడాది సెంటీమీటర్ ముందుకు జరుగుతోంది. ఈ పరిస్థితి జోషిమఠ్ పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదని.. 90 కిలోమీటర్ల దిగువన ఉన్న మరో పట్టణంలో కూడా పగుళ్లు ఏర్పడుతున్నాయని తేలింది. కర్ణప్రయాగ్, బహుగుణ నగర్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుత జోషిమఠ్ ప్రాంతంలో ప్రమాదం అంచున భవనాలను బుల్డోజర్ల సాయంతో అధికారులు కూల్చివేస్తున్నారు. జూలై 2020 నుండి మార్చి 2022 వరకు సేకరించిన ఉపగ్రహ చిత్రాలు మొత్తం ప్రాంతం నెమ్మదిగా కూరుకుపోతున్నట్లు వెల్లడైంది.