Ranchi: సీఎం హేమంత్తో రాహుల్, ఖర్గే భేటీ.. ఎవరికెన్ని సీట్లంటే..!
- జార్ఖండ్లో తేలిని ఇండియా కూటమి సీట్ల పంపకాలు
- జేఎంఎం.. కాంగ్రెస్కు 70.. మిత్రపక్షాలకు 11 సీట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా ఫలితాల తర్వాత ఇండియా కూటమి అప్రమత్తమైంది. సాగదీతలు.. నిర్లక్ష్య ధోరణికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. హర్యానా పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదని ముందు జాగ్రత్తగా సీట్ల పంపకాలపై కూటమి దృష్టి పెట్టింది. అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు పూర్తి చేశాయి.
జార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం హేమంత్ సోరెన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మిత్రపక్షాల నేతలు సమావేశమై సీట్ల పంపకాలపై చర్చించారు. సామరస్యంగా సీట్లు పంపకాలు పూర్తయ్యాయి. కాంగ్రెస్-జేఎంఎం పార్టీలు 70 సీట్లలో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మిగతా 11 స్థానాల్లో మిత్రపక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Also Read
- EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
జార్ఖండ్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి పని చేస్తోంది.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ గేమ్ప్లాన్ను వెల్లడించిన ఒక రోజు తర్వాత ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ప్రకటన వచ్చింది. ఇక బీజేపీ 68 స్థానాల్లో, ఏజేఎస్యూ 10 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు శర్మ ప్రకటించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ ఒకటి, ఎల్జేపీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, మాజీ సీఎం బాబూలాల్ మరాండీ, ఏజేఎస్యూ చీఫ్ సుదేష్ కుమార్ మహతోతో కలిసి ఉమ్మడి ప్రెస్మీట్లో శర్మ సీట్ల భాగస్వామ్య ప్రకటన చేశారు.
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!