JEE Advanced 2022 Exam: నేడు జేఈఈ ఎగ్జామ్.. అభ్యర్థులు ఈ నిబంధనలను మరవొద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Advanced 2022 Exam: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ రోజు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్సుడ్ పరీక్ష జరగనుంది. దీంతో అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధం అయ్యారు. ఆరు గంటల నిడివి కలిగిన ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉంటుంది. మొదటి షిఫ్టు ఆగస్టు 28 ఉదయం 9 నుంచి ప్రారంభం అయి 12.00 వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై 5.30 వరకు జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ కోసం హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎగ్జామ్ రాసేందుకు అధికారులు అనుమతించరు.
పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేవారు జేఈఈ అడ్వాన్సుడ్ 2022 అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఇవి లేకుంటే పరీక్షా కేంద్రాలకు అనుమతించరు. అభ్యర్థులు పెన్ను, పెన్సిల్ తో పాటు పారదర్శకంగా ఉండే వాటర్ బాటిళ్లను మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. జేఈఈ పరీక్షల్లో కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించనున్నారు. శరీర ఉష్ణోగ్రతను పరీక్షించిన తర్వాతే అధికారులు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. జేఈఈ అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ ను పరీక్ష ఇన్విజిలేటర్ కు అందచేయాలి.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Bank Holidays: ఏకంగా 13 రోజులు బ్యాంకుల మూత..!
చివరి నిమిషంలో హైరానా పడేకంటే ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు చేసుకుంటే మంచిది. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షహాల్ లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.. హాల్ లో అభ్యర్థులు అనవసర కదలికను ఎప్పటికప్పుడు అధికారులు, ఇన్విజిలేటర్లు పర్యవేక్షిస్తుంటారు. పూర్తిగా ఆన్ లైన్ పద్ధతిలో ఎగ్జామ్ జరుగుతుంది. అభ్యర్థులకు కంప్యూటర్ సిస్టమ్ కేటాయిస్తారు. ఒక వేళ కీబోర్డు, మౌస్ పనిచేయకపోతే మరో సిస్టమ్ కేటాయిస్తారు. ప్రతీ సెంటర్ వద్ద పరీక్ష నిర్వహించే వారితో పాటు ఒకరు లేదా అంతకంటే ఎక్కువగా ఐఐటీ ప్రతినిధులు ఉంటారు.
తెలుగు రాష్ట్రాల నుంచి 30 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్ లో 28 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ జరగనుంది. జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షా ఫలితాలు సెప్టెంబర్ 11న వెలువడనున్నాయి. అదే నెల 12 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది అడ్వాన్సుడ్ పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైనవారికి దేశంలోని 23 ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు. సీట్ల సంఖ్యకు రెండున్నర రెట్ల మంది ఉత్తీర్ణులయ్యేలా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..