Atala Mosque Row: “అటాలా మసీదు కాదు, ఆలయం”.. కోర్టుకు చేరిన వివాదం..
- వివాదంగా జౌన్పూర్ అటాలా మసీదు..
- అటాలా దేవీ ఆలయమని హిందూ పక్షం పిటిషన్..
- డిసెంబర్ 16న సర్వేపై కోర్టు నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atala Mosque Row: దేశంలో మందిర్-మసీద్ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్లోని సంభాల్ షాహీ జామా మసీదు సర్వే అంశం పెద్ద ఎత్తున హింసకు కారణమైంది. ఈ హింసలో ఐదుగురు వ్యక్తులు మరణించడంతో పాటు 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఈ మసీదు ఒకప్పటి హరిహర్ మందరమని, మొఘల్ పాలకుడు బాబర్ కూల్చివేసి మసీదుగా మార్చారని హిందూ పక్షం కోర్టును ఆశ్రయించడంతో సర్వేకి ఆదేశాలు ఇచ్చింది.
ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్లోని మరో మసీదు కూడా వివాదస్పదమైంది. జౌన్పూర్లోని ‘‘ అటాటా మసీదు’’ అంశం న్యాయస్థానంలో ఉంది. ఈ మసీదు హిందూ ఆలయమని కన్నౌజ్ రాజు విజయ్ చంద్ర ‘‘అటలా దేవి ఆలయం’’ నిర్మించారని హిందూ పక్షం చెబుతోంది. 14వ శతాబ్ధంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడని, దీంతో అక్కడ పూజలు నిలిపేశారని స్వరాజ్ వాహిని అసోసియేషన్ జౌన్పూర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో డిసెంబర్ 16 విచారణ జరగనుంది. మసీదు సర్వేపై కీలక ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.
Also Read
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
సివిల్ కోర్ట్ జూలై 2న ఈ పిటిషన్ని స్వీకరించి సర్వేకి ఆదేశించింది. జూలై 30న సర్వే చేసేందుకు వెళ్లిన సమయంలో భారీ సంఖ్యలో జనం రావడంతో సర్వే పూర్తి కాలేదు. దీంతో అదనపు భద్రత బలగాలను అందుబాటులో ఉంచాలని సర్వే టీం కోర్టుని కోరింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సర్వే చేయాలని హిందూ పక్షం అభ్యర్థించగా.. సర్వే ఫార్మాట్ని డిసెంబర్ 16న ఖరారు చేయనున్నారు.
హిందూ పక్షం వాదన ఇదే:
స్వరాజ్ వాహిని అసోసియేషన్, సంతోష్ కుమార్ మిశ్రా జౌన్పూర్ సివిల్ కోర్టులో దావా వేశారు. ఈ మసీదు ఒకప్పటి దేవీ ఆలయమని చెప్పారు. సనాతనధర్మాన్ని ఆచరించేవారికి పూజించే హక్కు ఉందని చెప్పారు. దీనిని 13 శతాబ్ధంలో రాజా విజయ్ చంద్రచే ఈ ఆలయం నిర్మించబడిందని పేర్కొన్నారు. 13వ శతాబ్ధంలో ఫిరోజ్ షా తుగ్లక్ భారతదేశంపై దండయాత్ర చేసి, గుడిని కూల్చేసి దాని గోడలపై మసీదు నిర్మించినట్లు చెప్పారు. హిందూ పక్షం వాదనల్ని ముస్లిం పక్షం ఖండించింది. ఏ ఆలయంపై మసీదు నిర్మించబడలేదని చెప్పింది. ఈ మసీదుని 1398లో నిర్మించారని, అప్పటి నుంచి నిరంతరం ఉపయోగంలో ఉందని, శుక్రవారం ముస్లిం సమాజం క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!