Jammu Kashmir: ఆర్టికల్ 370 రద్దు తర్వాత 88 శాతం తగ్గిన శాంతి భద్రతల సమస్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Article 370 revocation: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు, తర్వాత అన్నంతగా శాంతి భద్రత ఘటనల్లో మార్పు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత మూడేళ్లలో 88 శాతం శాంతి భద్రత ఘటనలు తగ్గాయని రాష్ట్రపోలీసులు వెల్లడించారు. ఆగస్టు 5, 2016 నుంచి ఆగస్టు 4, 2019 వరకు మూడేళ్లలో మొత్తం 3,686 శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆగస్ట్ 5, 2019 నుంచి ఆగస్టు 4,2022 వరకు మూడేల్లలో కేవలం 438 సంఘటనలు మాత్రమే నమోదు అయ్యాయి. ఇది 88 శాతం తగ్గుదల అని పోలీసులు వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్లో అల్లర్ల కారణంగా 2019 కన్నా ముందు మూడేళ్లలో 124 సాధారణ పౌరులు మరణించారు. అయితే 2019 నుంచి 2022 మధ్య ఇలాంటి అల్లర్లలో ఒక్కరూ కూడా మరణించలేదు. ఇదే విధంగా అల్లర్ల కారణంగా 2019కి ముందు మూడేళ్లలో మొత్తం ఆరుగులు పోలీస్, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ తరువాత నుంచి ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాలేదు. ఆర్టికల్ 370కి ముందు కాశ్మీర్ లో ఉగ్రదాడుల కారణంగా 290 భద్రతా సిబ్బంది మరణిస్తే.. 2019 నుంచి 2022 వరకు 174 మంది మాత్రమే చనిపోయారు. ఉగ్రదాడుల్లో 2019కి ముందు మూడేళ్లలో 191 మంది పౌరులు మరణిస్తే.. ప్రస్తుతం ఈ సంఖ్య 110కి పడిపోయిందని తెలిపారు.
Also Read
- CJP Protests: మా 4 డిమాండ్లలో రెండింటికి కేంద్రం అంగీకారం.. ఆందోళనపై CJP తాజా ప్రకటన..
- Public Examinations Act: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి పేపర్ లీక్ చేస్తే దబిడిదిబిడే..
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
Read Also: Tejas Aircraft: భారత తయారీ “తేజస్” యుద్ధవిమానంపై విదేశాల ఆసక్తి.
ఎన్నో ఎళ్లుగా కాశ్మీర్ ను భారత్ లో పూర్తిగా అంతర్భాగం కాకుండా అడ్డుగా నిలుస్తున్న ఆర్టికల్ 370, 35 ఏ లను బీజేపీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ పూర్తిస్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా.. భారత రాజ్యాంగం కిందికి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ను విభజించి జమ్మూ కాశ్మీర్, లఢాఖ్ అనే కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. అయితే భారత నిర్ణయంతో పాకిస్తాన్ ఏడుపు ఒక్కటే తక్కువ. ఆర్టికల్ 370 రద్దు కు ముందు దీన్ని అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు.. కాశ్మీర్ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించింది పాకిస్తాన్. నిత్యం రాళ్ల దాడులతో శాంతి భద్రత సమస్యలు ఏర్పడేవి. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాళ్లదాడులు బంద్ అయ్యాయి. వరసగా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెడుతున్నాయి.
తాజావార్తలు
-
Oppo K15 5G: 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. ఒప్పో K సిరీస్ 5G ఫోన్ విడుదల
-
Ashes Test in India: భారత్లో యాషెస్ టెస్టు..? సానుకూలంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.!
-
Shreyas Iyer: 7 మ్యాచ్ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్కు విముక్తి!
-
CJP Protests: మా 4 డిమాండ్లలో రెండింటికి కేంద్రం అంగీకారం.. ఆందోళనపై CJP తాజా ప్రకటన..
-
Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
ట్రెండింగ్
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!