Ministry of Home Affairs: జమ్మూకాశ్మీర్ గజ్నవీ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్పై కేంద్రం నిషేధం..
JKGF Banned In India: భారత దేశానికి, భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడుతున్న ఉగ్రసంస్థలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకర్తలతో ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్ గజ్నవీ ఫోర్స్ (జేకేజీఎఫ్)పై శుక్రవారం ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. దీంతో పాటు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)ను కూడా నిషేధించింది. ఈ రెండింటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి ఈ నిషేధం విధించింది కేంద్రం. దీంతో పాటు పంజాబ్ కు చెందిన హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: Kriti Kharbanda: కృతి.. నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ తోనే సెటిల్ అవుతున్నావా..?
Also Read
- West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
జేకేజీఎఫ్ దేశంలోకి చొరబాట్లు, మాదకద్రవ్యాల, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాద దాడులు, భద్రతా బలగాల బెదిరింపులకు పాల్పడుతోందని నోటిఫికేషన్ లో కేంద్ర పేర్కొంది. జకేజీఎఫ్ తన ఉగ్రవాదులను లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్, హర్కత్-ఉల్-జెహాద్-ఇ-ఇస్లామీ, ఇతర నిషేధిత ఉగ్రవాద సంస్థల నుంచి రిక్రూట్ చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలను భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు జేకేజీఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
సంధు అలియాస్ రిండా, పాకిస్తాన్ లాహోర్ లోని నిషేధిత ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపింది. 2021లో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్పై జరిగిన దాడి వెనుక సూత్రధారులలో సంధు ఒకడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతను పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్, కాంట్రాక్ట్ హత్యలు, దోపిడీ వంటి అనేక నేరాల్లో పాల్గొన్నట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన 54 వ్యక్తి రిండా. గత నెలలో కేంద్రం లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన రెండు ప్రాక్సీ ఉగ్రసంస్థలను నిషేధించింది. నలుగురు వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో