Ministry of Home Affairs: జమ్మూకాశ్మీర్ గజ్నవీ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్పై కేంద్రం నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JKGF Banned In India: భారత దేశానికి, భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడుతున్న ఉగ్రసంస్థలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకర్తలతో ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్ గజ్నవీ ఫోర్స్ (జేకేజీఎఫ్)పై శుక్రవారం ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. దీంతో పాటు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)ను కూడా నిషేధించింది. ఈ రెండింటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి ఈ నిషేధం విధించింది కేంద్రం. దీంతో పాటు పంజాబ్ కు చెందిన హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: Kriti Kharbanda: కృతి.. నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ తోనే సెటిల్ అవుతున్నావా..?
Also Read
- CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
జేకేజీఎఫ్ దేశంలోకి చొరబాట్లు, మాదకద్రవ్యాల, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాద దాడులు, భద్రతా బలగాల బెదిరింపులకు పాల్పడుతోందని నోటిఫికేషన్ లో కేంద్ర పేర్కొంది. జకేజీఎఫ్ తన ఉగ్రవాదులను లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్, హర్కత్-ఉల్-జెహాద్-ఇ-ఇస్లామీ, ఇతర నిషేధిత ఉగ్రవాద సంస్థల నుంచి రిక్రూట్ చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలను భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు జేకేజీఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
సంధు అలియాస్ రిండా, పాకిస్తాన్ లాహోర్ లోని నిషేధిత ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపింది. 2021లో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్పై జరిగిన దాడి వెనుక సూత్రధారులలో సంధు ఒకడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతను పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్, కాంట్రాక్ట్ హత్యలు, దోపిడీ వంటి అనేక నేరాల్లో పాల్గొన్నట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన 54 వ్యక్తి రిండా. గత నెలలో కేంద్రం లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన రెండు ప్రాక్సీ ఉగ్రసంస్థలను నిషేధించింది. నలుగురు వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!