Haryana Elections: అధికారాన్ని దూరం చేసిన రాహుల్ ‘జిలేబీ’ వ్యాఖ్యలు.. కాంగ్రెస్కు ఊహించని షాక్!
- హర్యానాలో కాంగ్రెస్కు ఊహించని షాక్!
- అధికారాన్ని దూరం చేసిన రాహుల్ ‘జిలేబీ’ వ్యాఖ్యలు
- తాజాగా ట్రెండింగ్ చేస్తోన్న బీజేపీ సోషల్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో ఈసారి హస్తం పార్టీదే అధికారమని.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సర్వేలన్నీ ఊదరగొట్టాయి. రెండు రోజులు గడిచే సరికి అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్లో ఏ ఒక్కటి నిజం కాలేదు. తిరిగి హర్యానా ప్రజలు కమలం పార్టీనే కోరుకున్నారు. హస్తం పార్టీని తిరిగి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా జిలేబీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
రాహుల్ గాంధీ హర్యానాలోని గోహనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ సింగ్ హూడా.. రాహుల్కు జిలేబీ తినిపించారు. జిలేబీ రుచి చూశాక రాహుల్ ఒక్కసారిగా మైమరిచారు. అద్భుతం అంటూ గొప్పగా పొగిడారు. తన జీవితంలో ఇంత అద్భుతమైన.. రుచికరమైన జిలేబీని ఎప్పుడూ తినలేదని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పబ్లిక్ మీటింగ్లో దీని గురించి ప్రసంగం చేశారు. తాను కారులో వస్తూ హర్యానా జిలేబీ రుచి చూశానని.. తన సోదరికి కూడా ఒక బాక్స్ తీసుకొస్తానని మెసేజ్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇదే అంశాన్ని మరింత సాగదీస్తూ.. ఇలాంటి జిలేబీలను ఫ్యాక్టరీల్లో తయారు చేసి దేశంలోనే ప్రతి ప్రాంతానికి వెళ్లాలని.. అంతేకాకుండా జపాన్, అమెరికాతో పాటు అన్ని దేశాలకు ఎగుమతి చేయాలని.. దీని ద్వారా అనేక మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. అనంతరం మోడీని టార్గెట్ చేస్తూ.. అదానీ, అంబానీలకు దేశాన్ని దోచుపెడుతున్నారని.. అదే జిలేబీ తయారు చేసే సంస్థలను ప్రోత్సహిస్తే.. ఎంతో మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇలా జిలేబీ అంశం సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ జిలేబీ వ్యాఖ్యలను బీజేపీ విపరీతంగా ట్రోలింగ్ చేసింది. జిలేబీ ఫ్యాక్టరీలంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసింది. తాజాగా ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ అంతా రివర్స్ అయిపోయింది. ఫలితాలు తారుమారు అయిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించిన వాళ్లంతా ఇప్పుడు జిలేబీ వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్ వ్యాఖ్యలు కొంపముంచాయంటూ కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుతున్నారు. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపే చూసినట్లుగా తాజా ఫలితాలను బట్టి అర్థమవుతోంది. అంతే కాకుండా కుల గణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. మొత్తానికి రాహుల్కి తీపి వార్త కాస్త.. చేదువార్త అయిందని బీజేపీ ట్రెండింగ్ చేస్తోంది.
“Modi is stopping small scale jalebi vendors from building jalebi factories. I want these vendors to be empowered enough to build their own jalebi factories” – Rahul Ghandy
As per this Jan Nayak , Jalebis are made in factories 🤣🤣🤣 pic.twitter.com/PhX9twDpKx
— Amitabh Chaudhary (@MithilaWaala) October 2, 2024
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?