Haryana Elections: అధికారాన్ని దూరం చేసిన రాహుల్ ‘జిలేబీ’ వ్యాఖ్యలు.. కాంగ్రెస్కు ఊహించని షాక్!
- హర్యానాలో కాంగ్రెస్కు ఊహించని షాక్!
- అధికారాన్ని దూరం చేసిన రాహుల్ ‘జిలేబీ’ వ్యాఖ్యలు
- తాజాగా ట్రెండింగ్ చేస్తోన్న బీజేపీ సోషల్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో ఈసారి హస్తం పార్టీదే అధికారమని.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సర్వేలన్నీ ఊదరగొట్టాయి. రెండు రోజులు గడిచే సరికి అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్లో ఏ ఒక్కటి నిజం కాలేదు. తిరిగి హర్యానా ప్రజలు కమలం పార్టీనే కోరుకున్నారు. హస్తం పార్టీని తిరిగి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా జిలేబీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
రాహుల్ గాంధీ హర్యానాలోని గోహనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ సింగ్ హూడా.. రాహుల్కు జిలేబీ తినిపించారు. జిలేబీ రుచి చూశాక రాహుల్ ఒక్కసారిగా మైమరిచారు. అద్భుతం అంటూ గొప్పగా పొగిడారు. తన జీవితంలో ఇంత అద్భుతమైన.. రుచికరమైన జిలేబీని ఎప్పుడూ తినలేదని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పబ్లిక్ మీటింగ్లో దీని గురించి ప్రసంగం చేశారు. తాను కారులో వస్తూ హర్యానా జిలేబీ రుచి చూశానని.. తన సోదరికి కూడా ఒక బాక్స్ తీసుకొస్తానని మెసేజ్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇదే అంశాన్ని మరింత సాగదీస్తూ.. ఇలాంటి జిలేబీలను ఫ్యాక్టరీల్లో తయారు చేసి దేశంలోనే ప్రతి ప్రాంతానికి వెళ్లాలని.. అంతేకాకుండా జపాన్, అమెరికాతో పాటు అన్ని దేశాలకు ఎగుమతి చేయాలని.. దీని ద్వారా అనేక మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. అనంతరం మోడీని టార్గెట్ చేస్తూ.. అదానీ, అంబానీలకు దేశాన్ని దోచుపెడుతున్నారని.. అదే జిలేబీ తయారు చేసే సంస్థలను ప్రోత్సహిస్తే.. ఎంతో మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇలా జిలేబీ అంశం సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ జిలేబీ వ్యాఖ్యలను బీజేపీ విపరీతంగా ట్రోలింగ్ చేసింది. జిలేబీ ఫ్యాక్టరీలంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసింది. తాజాగా ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ అంతా రివర్స్ అయిపోయింది. ఫలితాలు తారుమారు అయిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించిన వాళ్లంతా ఇప్పుడు జిలేబీ వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్ వ్యాఖ్యలు కొంపముంచాయంటూ కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుతున్నారు. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపే చూసినట్లుగా తాజా ఫలితాలను బట్టి అర్థమవుతోంది. అంతే కాకుండా కుల గణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. మొత్తానికి రాహుల్కి తీపి వార్త కాస్త.. చేదువార్త అయిందని బీజేపీ ట్రెండింగ్ చేస్తోంది.
“Modi is stopping small scale jalebi vendors from building jalebi factories. I want these vendors to be empowered enough to build their own jalebi factories” – Rahul Ghandy
As per this Jan Nayak , Jalebis are made in factories 🤣🤣🤣 pic.twitter.com/PhX9twDpKx
— Amitabh Chaudhary (@MithilaWaala) October 2, 2024
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!