Rajasthan: జూనియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్పై ర్యాగింగ్.. 300 గుంజీలు తీయించడంతో..!
- జూనియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్పై ర్యాగింగ్
- 300 గుంజీలు తీయించిన సీనియర్ల
- తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆయా కాలేజీల్లో ఇప్పటికే ర్యాంగింగ్లు జరుగుతూనే ఉన్నాయి. సీనియర్లు.. జూనియర్లను వేధించడం పరిపాటిగా మారిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్లో ర్యాంగింగ్ భూతం కారణంగా ఒక విద్యార్థి జీవితం ప్రమాదంలో పడింది.
ఇది కూడా చదవండి: Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
గత నెలలో రాజస్థాన్లోని దుంగార్పూర్లోని ఒక మెడికల్ కాలేజీలో కొంతమంది సీనియర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్కు పాల్పడ్డారు. దీంతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థికి నాలుగు సార్లు డయాలసిస్ చేయవలసి వచ్చింది. సెకండియర్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు.. జూనియర్ను 300 కంటే ఎక్కువగా గుంజీలు తీయించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అంతేకాకుండా అతని కిడ్నీపై తీవ్ర ప్రభావం పడింది.
ఇది కూడా చదవండి: Kenya: మిలటరీ ఆధీనంలో కెన్యా.. 13కు చేరిన మృతుల సంఖ్య
సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుంజీలు కారణంగా విద్యార్థి కిడ్నీ ఇన్ఫెక్షన్కు గురైందని పోలీసులు తెలిపారు. బాధితుడు వారం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఈ వారంలోనే నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని.. కాలేజీకి కూడా వెళ్తున్నట్లు వెల్లడించారు. ఏడుగురు విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్లు తేలడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే బాధితుడు గతంలోనే ర్యాగింగ్ ఎదుర్కొన్న ఫిర్యాదు చేయలేదని.. తాజా ఘటనతో వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఏడుగురు విద్యార్థులపై IPC సెక్షన్లు 323, 143, 147 (అల్లర్లు), 149 (సాధారణ వస్తువును ప్రాసిక్యూట్ చేయడంలో నేరం), 341 (తప్పు నిర్బంధం), 352 (దాడి) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీపై అనర్హత వేటు వేయాలి.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ
తాజావార్తలు
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!