Actor Darshan: ‘‘బట్టలు కంపు కొడుతున్నాయి, నాకు విషం ఇవ్వండి’’.. కోర్టును కోరిన కన్నడ స్టార్ దర్శన్..
- బట్టలు కంపుకొడుతున్నాయి, నాకు విషం ఇవ్వండి..
- కోర్టును కోరిన కన్నడ స్టార్ దర్శన్..
- రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష..
- గత నెలలో బెయిల్ రద్దు చేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Darshan: రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్మన్కు మంజూరు చేసిన బెయిల్ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దర్మన్ మంగళవారం కోర్టను తనకు ‘‘విషం ఇవ్వాలి’’ అని కోరారు. తాను రోజుల తరబడి సూర్యకాంతిని చూడలేదని చెప్పారు. రేణుకాస్వామి హత్య విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ముందు దర్శన్ హాజరయ్యారు. తన చేతుల్లో ఫంగస్ పెరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
జైలులో బయట అడుగు పెట్టడానికి కూడా అనుమతి లేనందున చాలా రోజులుగా సూర్యకాంతిని చూడలేదని, తన బట్టలు దుర్వాసన వస్తున్నాయని, జైలులో తాను తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నానని కోర్టుకు తెలియజేశారు. ఆ తర్వాత తనకు విషం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కోర్టు ఈ విషయాన్ని సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.
Also Read
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
- Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్తో కాంగ్రెస్లో కలకలం..
- Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కు లైన్క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం
Read Also: Nepal in Turmoil: సోషల్ మీడియా ఎఫెక్ట్.. పార్లమెంట్ను తగులబెట్టారు..! నేపాల్లో ముదిరిన హింస..
కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ను గత నెలలో కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసన ఆదేశించారు. ఆయన బెయిల్ పై ఉంటే సాక్షులను ప్రభావితం చేయగలరని, ఆయన బెయిల్పై బయట ఉంటే విచారణపై ప్రభావం పడుతుందని కోర్టు పేర్కొంది. దర్శన్కు బెయిల్ మంజూరు చేసేటప్పుడు ఆయన సెలబ్రిటీ హోదాను ఒక కారకంగా పరిగణించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆగస్టు 14న దర్శన్ను తిరిగి జైలుకు పంపారు.
దర్శన్తో రిలేషన్ షిప్ కలిగి ఉన్న పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారనే కారణంగా, చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెంగళూర్లో తీవ్రంగా హింసించి హత్య చేశారు. ఈ కేసులో పవిత్ర గౌడతో పాటు దర్శన్ మరికొంత మంది నిందితులుగా ఉన్నారు.
తాజావార్తలు
-
China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
-
Peddi: ‘పెద్ది’ రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
-
Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
-
AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
-
Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!