Actor Darshan: ‘‘బట్టలు కంపు కొడుతున్నాయి, నాకు విషం ఇవ్వండి’’.. కోర్టును కోరిన కన్నడ స్టార్ దర్శన్..
- బట్టలు కంపుకొడుతున్నాయి, నాకు విషం ఇవ్వండి..
- కోర్టును కోరిన కన్నడ స్టార్ దర్శన్..
- రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష..
- గత నెలలో బెయిల్ రద్దు చేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Darshan: రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్మన్కు మంజూరు చేసిన బెయిల్ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దర్మన్ మంగళవారం కోర్టను తనకు ‘‘విషం ఇవ్వాలి’’ అని కోరారు. తాను రోజుల తరబడి సూర్యకాంతిని చూడలేదని చెప్పారు. రేణుకాస్వామి హత్య విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ముందు దర్శన్ హాజరయ్యారు. తన చేతుల్లో ఫంగస్ పెరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
జైలులో బయట అడుగు పెట్టడానికి కూడా అనుమతి లేనందున చాలా రోజులుగా సూర్యకాంతిని చూడలేదని, తన బట్టలు దుర్వాసన వస్తున్నాయని, జైలులో తాను తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నానని కోర్టుకు తెలియజేశారు. ఆ తర్వాత తనకు విషం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కోర్టు ఈ విషయాన్ని సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.
Also Read
- Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- Punjab Politics: ఆప్పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
Read Also: Nepal in Turmoil: సోషల్ మీడియా ఎఫెక్ట్.. పార్లమెంట్ను తగులబెట్టారు..! నేపాల్లో ముదిరిన హింస..
కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ను గత నెలలో కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసన ఆదేశించారు. ఆయన బెయిల్ పై ఉంటే సాక్షులను ప్రభావితం చేయగలరని, ఆయన బెయిల్పై బయట ఉంటే విచారణపై ప్రభావం పడుతుందని కోర్టు పేర్కొంది. దర్శన్కు బెయిల్ మంజూరు చేసేటప్పుడు ఆయన సెలబ్రిటీ హోదాను ఒక కారకంగా పరిగణించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆగస్టు 14న దర్శన్ను తిరిగి జైలుకు పంపారు.
దర్శన్తో రిలేషన్ షిప్ కలిగి ఉన్న పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారనే కారణంగా, చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెంగళూర్లో తీవ్రంగా హింసించి హత్య చేశారు. ఈ కేసులో పవిత్ర గౌడతో పాటు దర్శన్ మరికొంత మంది నిందితులుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Ind Vs SL: ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 ప్రో 5G లాంచ్కు రెడీ?.. 8GB RAM, 256GB స్టోరేజ్.. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే!
-
Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
ట్రెండింగ్
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!