Jaishankar: బీబీసీ డాక్యుమెంటరీ.. రాజకీయ కుట్రేనన్న జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Shankar On BBC Documentary: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై తాజాగా భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ఈ డాక్యుమెంటరీ యాదృచ్ఛికంగా చేసింది కాదని.. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన పేర్కొన్నారు. కొందరు ధైర్యం లేని వ్యక్తులు.. రాజకీయ క్షేత్రంలోకి వచ్చేందుకు మీడియా ముసుగులో ఇలాంటి పాలిటిక్స్ చేస్తారని అన్నారు. ఈ బీబీసీ డాక్యుమెంటరీ వెనుక అలాంటి వ్యక్తులే ఉంటారని అభిప్రాయపడ్డారు.
Heeramandi: వ్యభిచారులుగా మారిన స్టార్ హీరోయిన్లు.. ఏ రేంజ్ లో చూపిస్తారు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘ధైర్యం లేని కొందరు వ్యక్తులు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు.. బీబీసీ డాక్యుమెంటరీ లాంటి ఆటలకు తెరలేపుతుంటారు. ఏదో ఒక స్వచ్ఛంద సంస్థనో లేదా మీడియా సంస్థ పేరు చెప్పి.. ఆ వ్యక్తులు ముసుగు కప్పుకుంటారు. కానీ.. వారు చేసేదంతా రాజకీయాలే! మీడియా పేరుతో ఇటువంటి వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. విదేశాల్లో అయితే ఇలాంటివి ఇప్పటికే ఎన్నో జరిగాయి, మనం వాటిని చూశాం కూడా! ఢిల్లీలో ఎన్నికల సీజన్ మొదలైందో లేదో తెలీదు కానీ.. లండన్, న్యూయార్క్లో మాత్రం మొదలైంది’’ అని వెల్లడించారు. ఎవరెన్ని ప్రచారాలు చేసినా.. ప్రజలు ఇచ్చే తీర్పే ముఖ్యమని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో జైశంకర్ 1984 నాటి సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘డాక్యుమెంటరీ తీయాలనుకుంటే.. 1984లో ఢిల్లీలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి వాటిపై డాక్యుమెంటరీ ఎందుకు తీయలేదు?’’ అని ప్రశ్నించారు.
Interesting Facts: మిమ్మల్ని వావ్ అనిపించే 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఇదిలావుండగా.. 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి బీబీసీ సంస్థ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. దీన్ని నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఇదే సమయంలో ముంబయి, ఢిల్లీ బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను అధికారులు సర్వే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!