Congress: ‘‘ మోడీకి చట్టం వర్తించదా..?’’ ధ్యానం ఫోటోపై దిగ్విజయ్ సింగ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ప్రధాని నరేంద్రమోడీ ధ్యానంపై కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసిన కొద్ది గంటల తర్వాత మే 30న ప్రధాని మోడీ కన్యాకుమారికి వెళ్లారు. అక్కడే 45 గంటలపాటు ధ్యానం చేశారు. ఒకప్పుడు స్వామి వివేకానంద ధాన్యం చేసిన ‘‘వివేకానంద మెమోరియల్’’ స్థలంలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, ఎన్నికల ముందు ఇలా చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ రోజు ప్రధాని మోడీ తన ధ్యానాన్ని ముగించారు.ఢిల్లీకి పయణమయ్యారు.
Read Also: Yadadri Thermal Power Plant: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై ఎంక్వైరీ స్పీడప్
Also Read
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
ఇదిలా ఉంటే, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మోడీ ధ్యానంపై ఫైర్ అయ్యారు. వివేకానంద మెమోరియల్లో ఫోటోగ్రఫీకి అనుమతి లేదని ఆయన అన్నారు. కానీ మోడీ ధ్యానం చేస్తున్న ఫోటోలు బయటకు రావడంపై అభ్యంతరం తెలిపారు. మోడీకి చట్టం, నిబంధనలు వర్తించవా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించాల్సిందిగా ప్రధాని కార్యాలయాన్ని(పీఎంఓ)ని కోరారు.
కపిల్ అనే యూజర్ ప్రధాని ధ్యానాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ఇక్కడ ఫోటోగ్రఫీకి అనుమతి లేదు మరియు చట్టం ద్వారా శిక్షార్హమైనది కాబట్టి మీరు వివేకానంద మెమోరియల్ లోపల ధ్యాన మందిరం ఫోటోలను చూడటం ఇదే మొదటిసారి.’’ ‘‘కెమెరా-జీవి’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వివేకానంద రాక్ మెమోరియల్ని సందర్శించడానికి ఫోటోగ్రఫీ నియమాలు కఠినమైనవి మరియు పరిమితం చేయబడ్డాయి, ఎందుకంటే ఇది రక్షిత మరియు సున్నితమైన ప్రాంతం. మీరు ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతి లేదు. స్మారక చిహ్నం లోపల, మీరు స్మారక చిహ్నం వెలుపల నుండి లేదా ఫెర్రీ నుండి మాత్రమే ఫోటోలు లేదా వీడియోలను తీయవచ్చు, మీరు ఇతర సందర్శకుల గోప్యత మరియు గౌరవాన్ని కూడా గౌరవించాలి మీ కెమెరాతో వారిని ఇబ్బంది పెట్టవద్దు లేదా వేధించవద్దు.’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్నే దిగ్విజయ్ సింగ్ హైలెట్ చేశారు.
Thank you @KapilSibal for pointing it out. Is @narendramodi not governed by law and rules or rules don’t apply to him. Would @PMOIndia please respond? @INCIndia @Jairam_Ramesh @RahulGandhi https://t.co/O0GBPKc1jU
— Digvijaya Singh (@digvijaya_28) June 1, 2024
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!