Congress: ‘‘ మోడీకి చట్టం వర్తించదా..?’’ ధ్యానం ఫోటోపై దిగ్విజయ్ సింగ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ప్రధాని నరేంద్రమోడీ ధ్యానంపై కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసిన కొద్ది గంటల తర్వాత మే 30న ప్రధాని మోడీ కన్యాకుమారికి వెళ్లారు. అక్కడే 45 గంటలపాటు ధ్యానం చేశారు. ఒకప్పుడు స్వామి వివేకానంద ధాన్యం చేసిన ‘‘వివేకానంద మెమోరియల్’’ స్థలంలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, ఎన్నికల ముందు ఇలా చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ రోజు ప్రధాని మోడీ తన ధ్యానాన్ని ముగించారు.ఢిల్లీకి పయణమయ్యారు.
Read Also: Yadadri Thermal Power Plant: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై ఎంక్వైరీ స్పీడప్
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఇదిలా ఉంటే, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మోడీ ధ్యానంపై ఫైర్ అయ్యారు. వివేకానంద మెమోరియల్లో ఫోటోగ్రఫీకి అనుమతి లేదని ఆయన అన్నారు. కానీ మోడీ ధ్యానం చేస్తున్న ఫోటోలు బయటకు రావడంపై అభ్యంతరం తెలిపారు. మోడీకి చట్టం, నిబంధనలు వర్తించవా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించాల్సిందిగా ప్రధాని కార్యాలయాన్ని(పీఎంఓ)ని కోరారు.
కపిల్ అనే యూజర్ ప్రధాని ధ్యానాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ఇక్కడ ఫోటోగ్రఫీకి అనుమతి లేదు మరియు చట్టం ద్వారా శిక్షార్హమైనది కాబట్టి మీరు వివేకానంద మెమోరియల్ లోపల ధ్యాన మందిరం ఫోటోలను చూడటం ఇదే మొదటిసారి.’’ ‘‘కెమెరా-జీవి’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వివేకానంద రాక్ మెమోరియల్ని సందర్శించడానికి ఫోటోగ్రఫీ నియమాలు కఠినమైనవి మరియు పరిమితం చేయబడ్డాయి, ఎందుకంటే ఇది రక్షిత మరియు సున్నితమైన ప్రాంతం. మీరు ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతి లేదు. స్మారక చిహ్నం లోపల, మీరు స్మారక చిహ్నం వెలుపల నుండి లేదా ఫెర్రీ నుండి మాత్రమే ఫోటోలు లేదా వీడియోలను తీయవచ్చు, మీరు ఇతర సందర్శకుల గోప్యత మరియు గౌరవాన్ని కూడా గౌరవించాలి మీ కెమెరాతో వారిని ఇబ్బంది పెట్టవద్దు లేదా వేధించవద్దు.’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్నే దిగ్విజయ్ సింగ్ హైలెట్ చేశారు.
Thank you @KapilSibal for pointing it out. Is @narendramodi not governed by law and rules or rules don’t apply to him. Would @PMOIndia please respond? @INCIndia @Jairam_Ramesh @RahulGandhi https://t.co/O0GBPKc1jU
— Digvijaya Singh (@digvijaya_28) June 1, 2024
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!