Congress: ‘‘ మోడీకి చట్టం వర్తించదా..?’’ ధ్యానం ఫోటోపై దిగ్విజయ్ సింగ్ ఫైర్..
Congress: ప్రధాని నరేంద్రమోడీ ధ్యానంపై కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసిన కొద్ది గంటల తర్వాత మే 30న ప్రధాని మోడీ కన్యాకుమారికి వెళ్లారు. అక్కడే 45 గంటలపాటు ధ్యానం చేశారు. ఒకప్పుడు స్వామి వివేకానంద ధాన్యం చేసిన ‘‘వివేకానంద మెమోరియల్’’ స్థలంలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, ఎన్నికల ముందు ఇలా చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ రోజు ప్రధాని మోడీ తన ధ్యానాన్ని ముగించారు.ఢిల్లీకి పయణమయ్యారు.
Read Also: Yadadri Thermal Power Plant: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై ఎంక్వైరీ స్పీడప్
Also Read
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
- West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..
- West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
- Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
ఇదిలా ఉంటే, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మోడీ ధ్యానంపై ఫైర్ అయ్యారు. వివేకానంద మెమోరియల్లో ఫోటోగ్రఫీకి అనుమతి లేదని ఆయన అన్నారు. కానీ మోడీ ధ్యానం చేస్తున్న ఫోటోలు బయటకు రావడంపై అభ్యంతరం తెలిపారు. మోడీకి చట్టం, నిబంధనలు వర్తించవా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించాల్సిందిగా ప్రధాని కార్యాలయాన్ని(పీఎంఓ)ని కోరారు.
కపిల్ అనే యూజర్ ప్రధాని ధ్యానాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ఇక్కడ ఫోటోగ్రఫీకి అనుమతి లేదు మరియు చట్టం ద్వారా శిక్షార్హమైనది కాబట్టి మీరు వివేకానంద మెమోరియల్ లోపల ధ్యాన మందిరం ఫోటోలను చూడటం ఇదే మొదటిసారి.’’ ‘‘కెమెరా-జీవి’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వివేకానంద రాక్ మెమోరియల్ని సందర్శించడానికి ఫోటోగ్రఫీ నియమాలు కఠినమైనవి మరియు పరిమితం చేయబడ్డాయి, ఎందుకంటే ఇది రక్షిత మరియు సున్నితమైన ప్రాంతం. మీరు ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతి లేదు. స్మారక చిహ్నం లోపల, మీరు స్మారక చిహ్నం వెలుపల నుండి లేదా ఫెర్రీ నుండి మాత్రమే ఫోటోలు లేదా వీడియోలను తీయవచ్చు, మీరు ఇతర సందర్శకుల గోప్యత మరియు గౌరవాన్ని కూడా గౌరవించాలి మీ కెమెరాతో వారిని ఇబ్బంది పెట్టవద్దు లేదా వేధించవద్దు.’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్నే దిగ్విజయ్ సింగ్ హైలెట్ చేశారు.
Thank you @KapilSibal for pointing it out. Is @narendramodi not governed by law and rules or rules don’t apply to him. Would @PMOIndia please respond? @INCIndia @Jairam_Ramesh @RahulGandhi https://t.co/O0GBPKc1jU
— Digvijaya Singh (@digvijaya_28) June 1, 2024
తాజావార్తలు
-
Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
-
Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
-
Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
-
West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..
-
Bollywood : బాలీవుడ్లో సత్తా చాటలేకపోతున్న సౌత్ స్టార్స్.. ఇక్కడ టాప్ పొజిషన్.. హిందీలో ఫ్లాపులు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!