కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ సీహెచ్ ప్రతాప్రెడ్డి నియమితులయ్యారు.. బెంగళూరు పోలీస్ బాస్గా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయనను సీపీగా నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు.. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రతాప్రెడ్డి… గతంలో బెంగళూరు నగర అదనపు కమిషనర్గా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు.. ఇప్పుడు బెంగళూరు పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోనున్నారు.
Read Also: CBI Raids: చిదంబరం ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు
ఇక, బీటెక్ పూర్తిచేసి ఐపీఎస్ అయిన ప్రతాప్రెడ్డి మొదట హాసన్ జిల్లా అరసికెరె ఏఎస్పీగా, తరువాత పలు జిల్లాల ఎస్పీగా, కొంతకాలం బెంగళూరు – ముంబై సీబీఐ విభాగంలో విధులు నిర్వర్తించారు ప్రతాప్ రెడ్డి… సైబర్ సెక్యూరిటీ విభాగంలో కీలక పాత్ర పోషించారు.. విశిష్ట సేవలకు రాష్ట్రపతి, సీఎం మెడళ్లను అందుకున్నారు.. ఆయన ఇవాళ బాధ్యతలు తీసుకుంటారు. ఇక, కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మైని కలిసి ప్రతాప్రెడ్డి.. తనను బెంగళూరు సీపీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డికి అభినందనలు తెలిపారు సీఎం బొమ్మై.