Haryana: నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు .. 2 వారాల తర్వాత పునరుద్ధరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు. 2 వారాల తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ చేశారు. గత కొద్ది రోజులుగా నుహ్ జిల్లాలో మత హింసలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 31న రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. జులై 31న మూసివేసిన విద్యా సంస్థలను కూడా గత వారమే తెరిచారు. హర్యానా రాష్ట్ర రవాణా బస్సు సర్వీసులు కూడా పూర్తిగా పునరుద్ధరించారు. విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో నిర్వహించిన మతపరమైన ఊరేగింపును మరో వర్గం అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలు హర్యానాలోని గురుగ్రామ్, పాల్వాల్, ఫరీదాబాద్ వంటి ఇతర జిల్లాలకు కూడా వ్యాపించాయి. తీవ్ర స్థాయిలో చెలరేగిన ఈ హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హింసలో ఇద్దరు హోంగార్డులు, ఒక మసీదు మతాధికారి సహా ఆరుగురు మరణించారు. అనేక వాహనాలు, దుకాణాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టారు.
Read also: Katrina Kaif Birthday Celebrations: బీచ్ ఒడ్డున కత్రీనా.. హొయలు పోతుందిలా
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
నుహ్లో జరిగిన మతపరమైన ఊరేగింపునకు గోసంరక్షకుడు మోను మనేసర్ హాజరవుతారనే పుకార్లు ఘర్షణలకు దారి తీశాయి. నుహ్ మతపరమైన ఊరేగింపుకు హాజరవుతున్నట్లు పేర్కొంటూ, పెద్ద సంఖ్యలో బయటకు రావాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చిన వీడియోను మానేసర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఘర్షణల్లో మనేసర్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మత పరమైన హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 390 మందికి పైగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి 100కి పైగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు(ఎఫ్ఐఆర్) దాఖలు చేశారు. ఆదివారం పాల్వాల్లో ఒక హిందూ సంస్థ మహాపంచాయత్ నిర్వహించింది. అక్కడ సభ్యులు నుహ్ జిల్లాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాన్ని గోహత్య రహితంగా మార్చాలని 51 మందితో కూడిన కమిటీ సమావేశంలో తీర్మానించింది. అలాగే ఆగస్టు 28న నుహ్లో జలహిషేక్ యాత్రను మళ్లీ ప్రారంభించాలని కమిటీ నిర్ణయించింది.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!