Haryana: నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు .. 2 వారాల తర్వాత పునరుద్ధరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు. 2 వారాల తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ చేశారు. గత కొద్ది రోజులుగా నుహ్ జిల్లాలో మత హింసలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 31న రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. జులై 31న మూసివేసిన విద్యా సంస్థలను కూడా గత వారమే తెరిచారు. హర్యానా రాష్ట్ర రవాణా బస్సు సర్వీసులు కూడా పూర్తిగా పునరుద్ధరించారు. విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో నిర్వహించిన మతపరమైన ఊరేగింపును మరో వర్గం అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలు హర్యానాలోని గురుగ్రామ్, పాల్వాల్, ఫరీదాబాద్ వంటి ఇతర జిల్లాలకు కూడా వ్యాపించాయి. తీవ్ర స్థాయిలో చెలరేగిన ఈ హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హింసలో ఇద్దరు హోంగార్డులు, ఒక మసీదు మతాధికారి సహా ఆరుగురు మరణించారు. అనేక వాహనాలు, దుకాణాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టారు.
Read also: Katrina Kaif Birthday Celebrations: బీచ్ ఒడ్డున కత్రీనా.. హొయలు పోతుందిలా
Also Read
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
నుహ్లో జరిగిన మతపరమైన ఊరేగింపునకు గోసంరక్షకుడు మోను మనేసర్ హాజరవుతారనే పుకార్లు ఘర్షణలకు దారి తీశాయి. నుహ్ మతపరమైన ఊరేగింపుకు హాజరవుతున్నట్లు పేర్కొంటూ, పెద్ద సంఖ్యలో బయటకు రావాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చిన వీడియోను మానేసర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఘర్షణల్లో మనేసర్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మత పరమైన హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 390 మందికి పైగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి 100కి పైగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు(ఎఫ్ఐఆర్) దాఖలు చేశారు. ఆదివారం పాల్వాల్లో ఒక హిందూ సంస్థ మహాపంచాయత్ నిర్వహించింది. అక్కడ సభ్యులు నుహ్ జిల్లాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాన్ని గోహత్య రహితంగా మార్చాలని 51 మందితో కూడిన కమిటీ సమావేశంలో తీర్మానించింది. అలాగే ఆగస్టు 28న నుహ్లో జలహిషేక్ యాత్రను మళ్లీ ప్రారంభించాలని కమిటీ నిర్ణయించింది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..