Inspirational News: కొడుకును ఆదర్శంగా తీసుకున్న తండ్రి. డాక్టర్ అయ్యేందుకు 55 ఏళ్ల వయసులో ‘నీట్’కి హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inspirational News: సహజంగా తండ్రిని కొడుకు ఆదర్శంగా తీసుకుంటాడు. కానీ ఈ కథ వేరు. తండ్రే కొడుకు బాటలో నడిచాడు. డాక్టర్ అవ్వాలనే జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు ఏకంగా 55 ఏళ్ల వయసులో ‘నీట్’కి హాజరయ్యాడు. అతని పేరు కె.రాజ్యక్కొడి. తమిళనాడులోని మదురై వాసి. రైతు. తెల్ల చొక్కా వేసుకున్నాడు. నెత్తి మీద జుట్టు కూడా తెల్లబడింది. మదురైలో మొన్న ఆదివారం జరిగిన నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్)కి హాజరయ్యేందుకు విద్యార్థులందరితోపాటు లైన్లో నిల్చున్నాడు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లటానికి అతని వంతు రాగానే సెక్యూరిటీ గార్డులు ఆపారు.
ఇంత వయసులో నువ్వు ఈ పరీక్ష రాయటానికి రావటమేంటి అనే అర్థం వచ్చేలా లుక్కేశారు. వాళ్లు ఆపినందుకు ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎవరికైనా ఈ డౌట్ వస్తుంది. దీంతో ఆయన తన చేతిలో ఉన్న హాల్ టికెట్ను చూపించగా మారుమాట్లాడకుండా లోపలికి అనుమతించారు. దీంతో అక్కడున్నవాళ్లందరూ అవాక్కయ్యారు. తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్ష కేంద్రం నిర్వాహకులు ముక్కు మీద వేలేసుకున్నారు. ఒకరినొకరు గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. అంబత్తైయాన్పట్టి ప్రాంతానికి చెందిన రాజ్యక్కొడి నిజానికి ఎప్పుడో డాక్టర్ కావాల్సింది.
Also Read
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
also read: Kodali Nani: ఇతర రాష్ట్రాలలో రోడ్లపై గోతుల్లేవా? లేవని నిరూపించగలవా పవన్?
1984లోనే పరీక్షలన్నీ పాసయ్యాడు. కానీ అప్పట్లో ప్రైవేట్లో ఎంబీబీఎస్ ఫీజు కట్టే స్తోమత లేక బీఎస్సీ(ఫిజిక్స్)లో చేరి మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఈ లోపు మరెన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా డాక్టర్ కావాలనే కోరిక ఆయనలో అప్పటి నుంచీ రగులుతూనే ఉండిపోయింది. వయసు పెరుగుతుండటంతో జీవితంలో ఇక డాక్టర్ని కాలేనేమో అని కూడా అనుకున్నాడు. కానీ ఒడిశాకి చెందిన ఓ వ్యక్తి 64 ఏళ్ల వయసులో గతేడాది మెడికల్ కాలేజీలో సీటు పొందాడని తెలుసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. రోజుకు కనీసం మూడు గంటలు శ్రద్ధగా చదవాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాడు.
రాజ్యక్కొడి చిన్న కొడుకు వాసుదేవన్ రెండో ప్రయత్నంలో ‘నీట్’లో విజయం సాధించాడు. 521 మార్కులతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు. దీంతో కొడుకు స్టడీ మెటీరియల్నే తండ్రీ చదవటం ప్రారంభించాడు. ఏడాది ప్రిపేరయ్యాడు. మాక్ టెస్టులెన్నో రాశాడు. మొత్తానికి మొన్న ‘నీట్’కీ అటెండ్ అయ్యాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఈజీగా వచ్చాయని చెప్పాడు. 460 మార్కులు వస్తాయని అంచనా వేస్తున్నాడు. తనకు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వస్తే డాక్టర్ కావాలనే జీవిత కలను సాకారం చేసుకుంటానని అన్నాడు. రాజ్యక్కొడి పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?