New Delhi: మంత్రి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన యువతిపై ఇంక్ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్తాన్ కేబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన 23 ఏళ్ల యువతిపై ఢిల్లీలో కొంతమంది దుండగులు సిరా దాడి చేశారు. సిరాను ఆమె మొహంపై వేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ జిల్లా) ఈషా పాండే మాట్లాడుతూ.. శనివారం రాత్రి కొందరు దుండగులు యువతిపై ఏదో విసిరి పారిపోయారని తమకు కాల్ వచ్చిందని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మహిళను ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు తరలించారు.
శనివారం రాత్రి 9.30 గంటలకు కాళింది కుంజ్ రోడ్డ సమీపంలో తన తల్లితో కలిసి నడుచుకుంటూ వస్తున్న బాధితురాలిపై ఇద్దరు వ్యక్తులు ఇంక్ విసిరి పారిపోయారు. ఆమె ఫిర్యాదు ప్రకారం ఐపీసీ 195 A (ఎవరినైనా తప్పుడు సాక్ష్యం చెప్పమని బెదిరించడం), 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష) మరియు 34 (అనేక వ్యక్తులు చేసిన చర్యలు) కింద షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
ఈ ఘటనకు ముందు రాజస్తాన్ క్యాబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషిపై సదరు బాధిత యువతి సదర్ బజార్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు పెట్టింది. 2020లో ఫేస్ బుక్ ద్వారా రోహిత్ జోషి తనతో పరిచయం పెంచుకున్నాడని.. ఆమె ఆరోపించింది. జనవరి 8, 2021లో సవాయ్ మాధోపూర్ కు తీసుకెళ్లి, మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తనపై తన ప్రమేయం లేకుండా అత్యాచారం చేశాడని ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ నివేదిక కోరారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన కుమారుడిని కాపాడటానికి ప్రయత్నించ వద్దని ఆమె కోరారు. బాధిత యువతికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సిరాతో దాడి చేయడం, ఆమెను బెదిరిండంపై మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక కోరింది.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!