Infosys Co-Founder: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడితో పాటు మరో 17 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

  • ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడితో పాటు మరో 17 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..
  • తనపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగంలో నుంచి తొలగించారని మాజీ ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ దుర్గప్ప..
  • గిరిజన తెగకు చెందిన దుర్గప్ప ఫిర్యాదుతో క్రిస్‌ గోపాలకృష్ణన్‌తో పాటు 17 మందిపై కేసు నమోదు
Infosis

Infosis

Infosys Co-Founder: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్‌ గోపాలకృష్ణన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) మాజీ డైరెక్టర్‌ బలరామ్‌తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద సోమవారం నాడు కేసు నమోదు అయింది. అయితే, 2014లో హనీ ట్రాప్ కేసులో తనను అన్యాయంగా ఇరికించడంతో.. నన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి దారితీసిందని గిరిజన బోవి కమ్యూనిటీకి చెందిన మాజీ ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ దుర్గప్ప ఆరోపించారు.

Read Also: Nagoba Jatara: నేడే నాగోబా జాతర మొదలు.. మహా పూజతో జాతర షురూ

అయితే, ఐఐఎస్‌సీలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న దుర్గప్ప.. తనపై కులపరమైన విమర్శలతో పాటు బెదిరింపులను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. దీంతో 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు నగరంలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా, ఈ అంశంపై ఐఐఎస్‌సీ అధ్యాపకుల గానీ, ఐఐఎస్‌సీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యునిగా పని చేస్తున్న ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు సేనాపతి గోపాలకృష్ణన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక, ఈ కేసులో నిందితులుగా ఉన్న గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దాసప్ప, బలరామ్ పీ, హేమలతా మిషీ, ఛటోపాద్యాయ కే, ప్రదీప్ డీ సావ్కర్ తో పాటు మనోహరన్ ఉన్నారు.