Influenza Cases Rise: పుదుచ్చేరిలో ఇన్ఫ్లూయెంజా కలకలం.. స్కూళ్లు మూసేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Influenza Cases Rise in Puducherry:పుదుచ్చేరిలో ఇన్ఫ్లూయెంజా కేసులు పెరుగుతన్నాయి. ఇటీవల కాలంలో ఇన్ఫ్లూయెంజా వ్యాధికి సంబంధించిన కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న తరగతులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి, విద్యాశాఖ మంత్రి ఎ. నమశ్శివాయం 1 నుంచి 8వ తరగతి ఉన్న తరగతులను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత వారం నుంచి వివిధ ఆస్పత్రుల్లో ఇన్ఫ్లూయెంజా కేసులు పెరిగాయి. ఇన్ఫ్లూయెంజాతో బాధపడే పిల్లలతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. 50 శాతం వరకు ఇన్ఫ్లూయెంజా కేసులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Deepa: చిత్ర పరిశ్రమలో విషాదం.. నటి దీప ఆత్మహత్య
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
చాలా మంది పిల్లలు దగ్గు, విపరీతమైన జ్వరాలతో ఆస్పత్రులకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పిల్లలకు ఫ్లూ సోకితే ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుందని.. పిల్లల నుంచి వచ్చే తుంపర్లు, శ్లేష్మం ద్వారా, ప్రత్యక్ష తాకడి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని.. ఇది స్కూల్ పిల్లల్లో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పిల్లలు తప్పకుండా ఇళ్లకే పరిమితం కావాలని.. ముఖానికి తప్పకుండా మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాధి విస్తరిస్తుండటంతో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ ప్రభుత్వం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తోంది ప్రభుత్వం. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. కోవిడ్-19 కేసులు తగ్గిన తర్వాత ప్రజలు మాస్కులు లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాలకు తరలివస్తున్నారని.. దీంతో ఫ్లూ వంటి వ్యాధి వ్యాప్తి ఎక్కువ అయిందని తేలింది.
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!