Indore: టీవీ ఎక్కువగా చూస్తున్నారని తిట్టడమే పాపమైంది.. తల్లిదండ్రుల్ని కోర్టుకీడ్చిన పిల్లలు..
- టీవీ చూస్తున్నారని పిల్లల్ని తిట్టిన తల్లిదండ్రులు..
- తల్లిదండ్రులపై పోలీస్ కేసు పెట్టిన పిల్లలు..
- నేరారోపణ నిజమైతే 7 ఏళ్లు శిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore: సాధారణంగా ఏ ఇంట్లో అయిన పిల్లలు ఎక్కువ సేపు టీవీ చూసినా, మొబైల్తో కాలక్షేపం చేసిన తల్లిదండ్రులు తిట్టడం, హెచ్చరించడం కామన్. అయితే, మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇలాగే తల్లిదండ్రులు తమ కూతురు, కొడుకుని తిట్టారు. ఆ తర్వాత తమపై పోలీస్ కేసు నమోదైందని ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఆ తల్లిదండ్రుల వంతైంది. ఈ గొడవ కోర్టుకు కూడా చేరింది. ఈ ఘటన అక్టోబర్ 25,2021లో జరిగింది. దంపతుల కుమార్తె(21), కుమారుడు(8) నగరంలోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ తల్లిదండ్రులు తమను కొట్టారని ఆరోపించారు.
Read Also: Success Story: ఇస్రోకు నో చెప్పి.. రూ.52 లక్షల కొలువు పట్టేసింది.. రైతుబిడ్డ సక్సెస్ స్టోరీ..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఇదే కాకుండా తల్లిదండ్రులపై ఏడేళ్ల వరకు శిక్ష పడే అభియోగాలను మోపారు. IPC సెక్షన్లు 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 342 (తప్పుగా నిర్బంధించడం), 294 (అసభ్యకరమైన మాటలు చెప్పడం), 506 (నేరపూరిత బెదిరింపు), మరియు 34 (సాధారణ ఉద్దేశ్యం), అలాగే సెక్షన్లు 75 (పిల్లల పట్ల క్రూరత్వం) మరియు జువెనైల్ జస్టిస్ చట్టం యొక్క 82 (శారీరక శిక్ష) కింద కేసులు నమోదు చేశారు.
తల్లిదండ్రుల తరుపున కోర్టులో వాదించిన న్యాయవాది ధర్మేంద్ర చౌదరి తన వాదనల్ని వినిపిస్తూ, హైకోర్టు విచారణపై మధ్యంతర స్టే ఇచ్చారని చెప్పారు. తల్లిదండ్రులు కేవలం సాధారణ క్రమశిక్షణను పాటించారని, అన్ని ఇళ్లలో కూడా పిల్లలు ఎక్కువ సేపు మొబైల్ చూడటం, టీవలు చూడటం వంటివి చేస్తే మందలించడం సాధారణంగా జరుగుతుందని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఆయన వాదించారు. పిల్లలు మొబైల్, టీవీలకు అలవాటు పడిన ప్రతీ ఇళ్లు కూడా ఇబ్బంది పడుతోందని, పిల్లల్ని తిట్టడం మామూలే అని ఆయన చెప్పారు. తల్లిదండ్రుల్ని కోర్టుకీడ్చినప్పటి నుంచి పిల్లలు ఇద్దరూ వారి అత్త వద్ద నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!