Indo-Pak Border: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఇండో-పాక్ సరిహద్దు కంచె.. వీడియో వైరల్
- భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఇండో-పాక్ సరిహద్దు కంచె
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర భారత్ను ఈ ఏడాది భారీ వర్షాలు ముంచెత్తాయి. కౌడ్ల బరస్ట్ కారణంగా జమ్మూకాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక రావి నది ఉధృతి కారణంగా పంజాబ్ సరిహద్దు బెల్టు అంతటా విధ్వంసం సృష్టించింది. దీంతో ఇండో-పాక్ సరిహద్దులో దాదాపు 30 కి.మీ. ఇనుప కంచె కొట్టుకుపోయింది. దీంతో భద్రతా దళాలు డజన్ల కొద్దీ పోస్టులను ఖాళీ చేయాల్సి వచ్చింది. గురుదాస్పూర్, అమృత్సర్, పఠాన్కోట్ జిల్లాల్లోని 50 కి పైగా బీఎస్ఎఫ్ చెక్పోస్టులు దెబ్బతిన్నాయి. ఇనుప సరిహద్దు కంచె దాదాపు 30 కిలోమీటర్లు కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
ఓ వైపు నష్టం జరిగినప్పటికీ బీఎస్ఎఫ్ సిబ్బంది మాత్రం తమ గస్తీని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితులున్నా.. పడవలతో పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అదునుగా మాదకద్రవ్యాల స్మగ్లర్లు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైన్యం గుర్తించింది. దీంతో భద్రతను మరింత కఠినతరం చేశారు. స్మగ్లర్ల ప్రయత్నాలను దళాలు అడ్డుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: Ajit Pawar-IPS: నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? ఐపీఎస్పై డిప్యూటీ సీఎం చిందులు
గుర్దాస్పూర్లో దాదాపు 30 నుండి 40 వరకు అవుట్పోస్టులు మునిగిపోయాయి. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. గురుదాస్పూర్, అమృత్సర్, ఫిరోజ్పూర్ సెక్టార్లలో దాదాపు 30 కి.మీ. ఫెన్సింగ్ కొట్టుకుపోయిందని బిఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎకె విద్యార్థిని తెలిపారు. అమృత్సర్లోని షాజాదా గ్రామంలో నీటి మట్టం పెరగడంతో సైనికులు కమల్పూర్లోని బీఎస్ఎఫ్ పోస్ట్ను ఖాళీ చేశారు. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ సమీపంలోని ప్రసిద్ధ బీఎస్ఎఫ్ పోస్ట్ కూడా మునిగిపోయింది. సిబ్బంది తాత్కాలికంగా డేరా బాబా నానక్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్కు తరలివెళ్లారు. రావి నది జీరో లైన్కు రెండు వైపులా వరదలు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ రేంజర్లు కూడా తమ ఫార్వర్డ్ పోస్ట్లను వదిలివేయాల్సి వచ్చిందని ఒక అధికారి తెలిపారు. రాబోయే మూడు రోజులు వర్షాలు లేనందున నీటి మట్టాలు తగ్గుముఖం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితులు అంతా సర్దుకుంటాయని వెల్లడించారు.
#WATCH | Ferozepur, Punjab: Several kilometers of fencing on the India-Pakistan border submerged, as flood water coming from Pakistan crossed the International Border and damaged the embankment on the Indian side. pic.twitter.com/90ia1wlw4M
— ANI (@ANI) September 5, 2025
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!