India’s wedding industry: నవంబర్, డిసెంబర్లో దేశవ్యాప్తంగా 35 లక్షల వివాహాలు.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..?
- ఈ ఏడాది చివరి రెండు నెలల్లో 35 లక్షల వివాహాలు..
- ఏకంగా 4.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని అంచనా..
- భారీగా పుంజుకున్న భారత వివాహ పరిశ్రమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s wedding industry: భారతీయ వివాహ పరిశ్రమ పుంజుకుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏకంగా 35 లక్షల వివాహాలు జరగబోతున్నాయని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. వీటికి రూ. 4.25 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, 2023లో ఇదే కాలంలో 3.2 మిలియన్ల జంటలు ఒక్కటయ్యాయి. ఈ ఏడాది 3.5 మిలియన్ల పెళ్లిళ్లు జరగనున్నట్లు అంచనా. ఈ ఏడాది మొదట్లో అంటే జనవరి 15-జూలై 15 మధ్య దేశవ్యాప్తంగా 4.2 మిలియన్లకు పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాలకు సుమారుగా 5.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు స్టాక్ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ యొక్క నివేదిక,‘‘బ్యాండ్, బాజా, భారత్ అండ్ మార్కెట్స్’’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
Read Also: Supreme Court: హైకోర్ట్ జడ్జి ‘‘పాకిస్తాన్’’, ‘‘లోదుస్తులు’’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
Also Read
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ 2025(FY25)లో 49 మూహూర్త రోజులు, FY24లో 60 రోజులు ఉన్నట్లు తెలిపింది. భారతదేశం సంవత్సరానికి సుమారు 10 మిలియన్ల వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వెడ్డింగ్ మార్కెట్గా ఉంది. పెళ్లిళ్లకు తోడుగా ఇంటారాక్టివ్ కార్యక్రమాలు, మల్టీసెన్సరీ ఫుడ్ కౌంటర్లు, డ్రోన్ షోలు, ఆడియో ఇన్విటేషన్ ఇలాంటివి పెళ్లిళ్ల ఖర్చుల్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. గిఫ్ట్ పోర్టల్ FNP ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 30-40 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. దీనికి తోడు ఈ ఏడాది వివాహాలు నిర్వహించడానికి చాలా మంది ఎన్నారై జంటలు భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ఫెర్న్స్ ఎన్ పెటల్స్ వ్యవస్థాపకుడు మరియు ఎండి వికాస్ గుట్గుటియా తెలిపారు. ప్రభుదాస్ లిల్లాధర్ నివేదిక ప్రకారం.. బంగారంపై దిగుమతి సుంకాలు 15 శాతం నుంచి 6 శాతం తగ్గడంతో దేశవ్యాప్తంగా రాబోయే పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోళ్లలో గణనీయమైన పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!