Indian Economy: 2031 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- 2031 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- 2025-31 మధ్య సగటున 6.7 వృద్ధిరేటు..
- ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2025-2031 ఆర్థిక సంవత్సరాల మధ్య 6.7 వృద్ధిరేటు సగటున కలిగి ఉంటుందని, 2031 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. ఇది క్యాపెక్స్ పుష్, ప్రొడక్టివిటీ పెరుగుదల వల్ల సాధ్యం అవుతుందని, కోవిడ్ మహమ్మారికి ముందు దశాబ్ధంలో చూసిన 6.6 శాతం వృద్ధికి సమానంగా ఉంటుందని చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 6.8 శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. అధిక వడ్డీరేట్లు, కఠినమైన రుణ నిబంధనలు పట్టణ డిమాండ్పై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారంగా ద్రవ్యోల్బణం 2024-25లో సగటున 4.5 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఇది తక్కువ ఆహార ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది 5.4 శాతంగా ఉంది. అయితే, వాతావరణ పరిస్థితులు మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు దాని వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలకు కీలకమైన నష్టాలుగా నివేదిక చూస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ ఎక్కువ సాగు ఉన్నప్పటికీ, అధిక, అకాల వర్సాలు ప్రభావాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆహార ద్రవ్యోల్బణం, వ్యవసాయ ఆదాయానికి నిరంతర ప్రమాదంగా మిగిలే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
Also Read
Read Also: Scammer: పోలీస్ యూనిఫాం ధరించిన స్కామర్.. నిజమైన పోలీస్కే ఫోన్ చేసి చిక్కాడు..
“భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏవైనా మరింత పెరగడం వలన సరఫరా గొలుసులను నిరోధించవచ్చు, వాణిజ్యానికి అంతరాయం కలిగించవచ్చు మరియు చమురు ధరలను పెంచవచ్చు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది మరియు ఇన్పుట్ ఖర్చులు పెరుగుతాయి.” అని నివేదిక పేర్కొంది. 2023-24లో 0.7 శాతంతో పోలిస్తే 2024-25లో GDPలో 1 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ, బలమైన సేవల ఎగుమతులు, ఆరోగ్యకరమైన రెమిటెన్స్ ఇన్ఫ్లోల నేపథ్యంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు సేఫ్ జోన్లో ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
ఇదిలా ఉంటే, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం.. భారత సరకుల ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్లో 39.20 బిలియన్ డార్లకు చేరుకున్నాయి. ఇది గతేడాది 33.43 బిలియన్లు ఉంది. ప్రపంచ వాణిజ్యంలో మందగమనం మధ్య ఎగుమతుల్లో రెండంకెల వృద్ధికి ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆర్గానిక్ అండ్ ఇన్ ఆర్గానిక్ రసాయనాలు, వస్త్రాలు కారణమయ్యాయి. ఇది భారత తయారీ రంగంలో పెరుగుతున్న బలాన్ని చూపిస్తుంది. అక్టోబర్ 2024లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు (వస్తువులు మరియు సేవలను కలిపి) USD 73.21 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయి, అక్టోబర్ 2023 కంటే 19.08 శాతం వృద్ధిని నమోదు చేసింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?