Trump-Modi: ఈనెల 23 నుంచి సుంకాలపై భారత్-అమెరికా మధ్య కీలక చర్చలు
- వాణిజ్య యుద్ధంపై భారత్-అమెరికా మధ్య కీలక చర్చలు
- ఈనెల 23 నుంచి చర్చలు జరపనున్న ఇరు దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: Samantha: డేట్ చేస్తున్న డైరెక్టర్తో తిరుమలకి సమంత?
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఇదిలా ఉంటే అమెరికాతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో సుంకాలపై ట్రంప్తో మోడీ చర్చలు కూడా జరిపారు. ఇరువురి మధ్య సానుకూల వాతావరణం నెలకొన్నట్లుగా ఆ మధ్య ప్రెస్మీట్లో ట్రంప్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈనెల 23న ఇదే అంశంపై ఇరు దేశాలు చర్చించనున్నారు. దాదాపు 19 ఒప్పందాలకు సంబంధించిన అంశలపై నిబంధనలు ఖరారయ్యాయి. ఈనెల 23 నుంచి వాషింగ్టన్తో భారత్ చర్చలు ఉంటాయని వర్గాలు పేర్కొన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యా్ని 500 బిలియన్లకు పెంచే ఆలోచనతో ఇరు దేశాలు ఉన్నట్లు సమాచారం. ఇరు దేశాల చర్చలు చాలా సానుకూలంగా ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204
ఒప్పందంలో వస్తువుల వాణిజ్యం, సేవలు, పెట్టుబడులు, కస్టమ్స్ విధానాలు వంటి వివధ రంగాలకు సంబంధించి దాదాపు 19 విభాగాలు ఉండనున్నాయి. చర్చల కోసం భారత్ నుంచి సీనియర్ ప్రతినిధి బృందం వచ్చే వారం వాషింగ్టన్కు వెళ్లనున్నట్లు సమాచారం. అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం వెళ్లనుంది. ఏప్రిల్ 23 నుంచి వాషింగ్టన్లో మూడు రోజుల వ్యక్తిగత వాణిజ్య చర్చలు ఉండనున్నాయి.
వాణిజ్య ఒప్పందంలో ఎలక్ట్రిక్ వాహనాలు, కొన్ని పారిశ్రామిక వస్తువులు, వైన్లు, పాడి, పెట్రోకెమికల్స్, ఆపిల్స్, అల్ఫాల్ఫా ఎండుగడ్డి, చెట్టు గింజలు వంటి ఉత్పత్తులకు అమెరికా సుంకాలు తగ్గించే ఛాన్సుంది. అలాగే భారతదేశం కూడా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, రసాయనాలు, ప్లాస్టిక్లు, రొయ్యలు, నూనెగింజలు, ఉద్యానవన ఉత్పత్తులు వంటి రంగాలకు రాయితీలు ఇవ్వాలని చూస్తోంది. మొత్తానికి చర్చలు సఫలీకృతం అవుతాయని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: ‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!