Execution: నిమిషాప్రియా మాత్రమే కాదు, మరో దేశంలో ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష..
- నిమిషా ప్రియా లాగే ఇండోనేషియాలో మరో ముగ్గురికి ఉరిశిక్ష..
- డ్రగ్ స్మగ్లింగ్ కేసులో ఇరుకున్న భారతీయులు..
- దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా విడిపించే ప్రయత్నం..
- యెమెన్లో ఈ నెల 16న నిమిషా ప్రియాకు శిక్ష అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Execution: యెమెన్ దేశంలో కేరళ నర్సు నిమిషా ప్రియాకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ఈ శిక్ష నుంచి ఆమెను తప్పించేందుకు, షరియా చట్టాల ప్రకారం, బాధితుడి కుటుంబానికి ‘‘బ్లడ్ మనీ’’ కింద పరిహారం ఇచ్చేందుకు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. జూలై 14న భారత సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు విచారణ రానుంది. యెమెన్ దేశస్తుడి నుంచి తన పాస్పోర్టు తీసుకునేందుకు, నిమిషా ప్రియా మత్తు మందు ఇచ్చింది. ఇది వికటించి అతను మరణించడంతో, ఆమెకు అక్కడి చట్టాలు ఉరిశిక్ష విధించాయి.
ఇదిలా ఉంటే మరో దేశంలో కూడా ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష విధించబడింది. ఇండోనేషియాలోని కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషులుగా తేలిన తర్వాత ఇండోనేషియా చట్టాల ప్రకారం శిక్షను విధించారు. ఈతీర్పు అక్కడి హైకోర్టులు కూడా సమర్థించాయి. రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమల్కందన్లు ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
Read Also: Chhangur Baba: ఛంగూర్ బాబాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు..
అయితే, ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి కోరారు. ఓడ కెప్టెన్, సిబ్బందితో సహా అందరు సాక్షుల్ని మరోసారి క్షుణ్ణంగా విచారించాలని కోరారు. ఇండోనేషియా న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకుం ఉందని, దర్యాప్తులో కొన్ని తేడాలను చూశామని, మొబైల్ ఫోన్ రికార్డులతో సహా అన్ని ఆధారాలను పరిశీలించలేదని చెప్పారు.
గత ఏడాది జూలైలో ఇండోనేషియాలోని రియావు దీవులలోని కరీమున్ ద్వీపం సమీపంలో సింగపూర్ జెండాతో ఉన్న ఓడ నుండి భారత పౌరులైన రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్ , గోవిందసామి విమల్కందన్లను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి స్థానిక కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. హైకోర్టు కూడా వీరి శిక్షని సమర్థించింది. రాబోయే రోజుల్లు వీరిని కూడా ఉరి తీసే అవకాశం ఉంది. అరెస్ట్ నుంచి విచారణ ప్రక్రియ వరకు ఇండోనేషియా అధికారులు నిర్లక్ష్యం వహించారిన భారత దౌత్యకార్యాలయం ఆరోపించింది. వీరి ముగ్గురిని విడిపించేందుకు భారత్ దౌత్య మార్గాల ద్వారా ఒత్తిడి తెస్తోంది.
తాజావార్తలు
-
Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!