Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం.. ఏ సిటిలో జరుగుతాయంటే..
- 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం..
- అహ్మదాబాద్లో జరుగనున్న మెగా స్పోర్ట్స్ ఈవెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ క్రీడలు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ కామన్వెల్త్ స్పోర్ట్ అహ్మదాబాద్ను కామన్వెల్త్ క్రీడల కోసం ఆతిథ్య నగరంగా సిఫారసు చేసింది. చివరిసారిగా 2010లో భారత్ ఈ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ను నిర్వహించింది. రెండోసారి భారత్ 2030లో ఆతిథ్యం ఇవ్వబోతోంది.
2030 కామన్వెల్త్ గేమ్స్ క్రీడలు, సంస్కృతి, ఐక్యతకు గొప్ప వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక శక్తి, శక్తి సామర్థ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశం ఉంది. భారత్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో కొత్త తరం అథ్లెట్లకు స్పూర్తినిస్తుంది.
Also Read
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
Read Also: Off The Record: అక్కడ టీడీపీలో రేషన్ మాఫియా కలకలం..!
ఇది వందో కామెన్వెల్త్ గేమ్స్ అవుతాయి. 2036లో భారత్ ఒలింపిక్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక ప్రారంభ కార్యక్రమంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు సంబంధించి, నవంబర్ 26, 2025న స్కాట్లాండ్లో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో ఆమోదం పొందవచ్చు.
భారత్ లో చివరి సారిగా ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. ఆ సమయంలో గేమ్స్ ప్రణాళిక లోపాలు, మౌలిక సదుపాయాల పూర్తి కాకపోవడం, అవినీతి ఆరోపణలు కారణంగా భారత ప్రతిష్ట మసగబారింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పీటి ఉషా ఈ 100వ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారత్కు గర్వకారణం అని అన్నారు.
2030 గేమ్స్ కోసం రూ. 825 కోట్లతో నిర్మించిన నరన్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రధాన వేదికగా ఉండనుంది. ఈ కార్యక్రమానికి అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభభాయి పటేల్ ఎన్క్లేవ్, నరేంద్రమోడీ స్టేడియం వంటి వాటిని కూడా ఉపయోగిస్తారు.
తాజావార్తలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!