Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం.. ఏ సిటిలో జరుగుతాయంటే..
- 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం..
- అహ్మదాబాద్లో జరుగనున్న మెగా స్పోర్ట్స్ ఈవెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ క్రీడలు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ కామన్వెల్త్ స్పోర్ట్ అహ్మదాబాద్ను కామన్వెల్త్ క్రీడల కోసం ఆతిథ్య నగరంగా సిఫారసు చేసింది. చివరిసారిగా 2010లో భారత్ ఈ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ను నిర్వహించింది. రెండోసారి భారత్ 2030లో ఆతిథ్యం ఇవ్వబోతోంది.
2030 కామన్వెల్త్ గేమ్స్ క్రీడలు, సంస్కృతి, ఐక్యతకు గొప్ప వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక శక్తి, శక్తి సామర్థ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశం ఉంది. భారత్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో కొత్త తరం అథ్లెట్లకు స్పూర్తినిస్తుంది.
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
Read Also: Off The Record: అక్కడ టీడీపీలో రేషన్ మాఫియా కలకలం..!
ఇది వందో కామెన్వెల్త్ గేమ్స్ అవుతాయి. 2036లో భారత్ ఒలింపిక్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక ప్రారంభ కార్యక్రమంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు సంబంధించి, నవంబర్ 26, 2025న స్కాట్లాండ్లో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో ఆమోదం పొందవచ్చు.
భారత్ లో చివరి సారిగా ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. ఆ సమయంలో గేమ్స్ ప్రణాళిక లోపాలు, మౌలిక సదుపాయాల పూర్తి కాకపోవడం, అవినీతి ఆరోపణలు కారణంగా భారత ప్రతిష్ట మసగబారింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పీటి ఉషా ఈ 100వ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారత్కు గర్వకారణం అని అన్నారు.
2030 గేమ్స్ కోసం రూ. 825 కోట్లతో నిర్మించిన నరన్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రధాన వేదికగా ఉండనుంది. ఈ కార్యక్రమానికి అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభభాయి పటేల్ ఎన్క్లేవ్, నరేంద్రమోడీ స్టేడియం వంటి వాటిని కూడా ఉపయోగిస్తారు.
తాజావార్తలు
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!