US tariffs: ట్రంప్ టారిఫ్స్పై రాజీ పడే అవకాశమే లేదు: భారత్..
- భారతదేశ ప్రయోజనాల్లో రాజీ పడే అవకాశమే లేదు..
- ట్రంప్ 25 శాతం సుంకాలపై స్పష్టం చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే, అమెరికా విధించిన సుంకాలను పట్టించుకునే పరిస్థితి లేదని, భారతదేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఎగుమతులు, దేశ జీడీపీపై తక్కువ ప్రభావం ఉంటుందని, భారతదేశంలో వ్యవసాయం, పాడిపరిశ్రం, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSMEలు) వంటి కీలక రంగాలు రక్షించబడతాయని విషయం తెలిసిన అధికారి తెలిపారు.
ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని, అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని సదరు అధికారి వెల్లడించారు. ‘‘25 శాతం సుంకాలు స్వల్ప ప్రభావం చూపవచ్చు. కానీ ఈ ప్రభావం భారత మార్కెట్లపై అస్సలు ఆందోళనకరమైంది కాదు’’ అని తెలిపారు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో భారత దేశ జీడీపీలో 0.2 శాతం కంటే తక్కువ నష్టానికి దారి తీయవచ్చు, దీనిని మెయింటెన్ చేయవచ్చు అని చెప్పారు.
Also Read
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Read Also: Chiranjeevi Birthday: ‘మెగా’ బ్లాస్టింగ్ లోడింగ్.. చిరంజీవి బర్త్ డేకి అదిరిపోయే అప్డేట్స్!
దేశ ప్రయోజనాలే అతిముఖ్యమైనవని, జన్యుపరంగా మార్పిడి చేసిన (GM) పంటల దిగుమతిని అనుమతించే ప్రశ్నే లేదని, దేశ వ్యవసాయం, పాడి పరిశ్రమలను దెబ్బతీసే ఏ నిబంధనలకు అంగీకరించేది లేదని భారత్ స్పష్టంగా చెబుతోంది. మాంసాహార పాలు, గొడ్డు మాంసం ఉత్పత్తులతో సహా మతపరమైన సున్నితత్వాలకు సంబంధించిన విషయాలపై ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్రం స్పష్టంగా చెబుతోంది.
ఈ టారిఫ్స్ వల్ల అత్యధిక ఎగుమతులు ప్రభావితం కావని, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే చాలా వస్తువులు కూడా ఈ కొత్త సుంకాల పరిధిలోకి రావని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఎగుమతులు కొద్దిగా తగ్గవచ్చని, కానీ అమెరికాకు వెళ్లే భారత వస్తువుల్లో ఎక్కువ భాగం సుంకాలకు వెలుపల ఉంటాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం, ప్రభుత్వం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) కోసం చర్చలు జరుపుతోందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
-
Smartphone Prices Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
-
CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?