India FDI Rules: మారిన రూల్స్.. చైనా సహా పొరుగు దేశాలకు FDI నిబంధనల సడలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India FDI Rules: భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం, చైనాతో పాటు ఇతర పొరుగు దేశాల నుండి పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు కొన్ని నిబంధనలను సడలించారు. దీంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
ఈ దేశాలకు లాభం
ఈ మార్పులతో ప్రభావితమయ్యే దేశాల్లో చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. గతంలో ఈ దేశాల పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉండేది. అయితే తాజా మార్పులతో ఈ ప్రక్రియను సులభతరం చేశారు. దీంతో వ్యాపార లావాదేవీలు వేగవంతమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
చైనా పెట్టుబడులు ఎంత?
భారతదేశంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో చైనా వాటా చాలా తక్కువగానే ఉంది. డిసెంబర్ 2025 నాటికి చైనా వాటా కేవలం 0.32 శాతం మాత్రమే. ఏప్రిల్ 2000 నుండి ఇప్పటివరకు చైనా నుంచి వచ్చిన మొత్తం FDI విలువ సుమారు 2.51 బిలియన్ అమెరికన్ డాలర్లు. అయితే, 2020లో జరిగిన గాల్వన్ లో భారత-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం TikTok మరియు WeChat సహా అనేక చైనీస్ యాప్లను నిషేధించింది.
ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదల
రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్-చైనా వాణిజ్యం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం చైనా, భారతదేశానికి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు US$14.25 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు US$113.45 బిలియన్లుకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు US$99.2 బిలియన్లుగా నమోదైంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు US$15.88 బిలియన్లుగా ఉండగా, దిగుమతులు US$108.18 బిలియన్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు US$92.3 బిలియన్లుగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?