Sharada Peeth: మన శారదా దేవీని దర్శించుకునే భాగ్యం దగ్గర్లోనే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు కారిడార్.. కేంద్రం యోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharada Peeth: హిందూ భక్తుల కోసం కేంద్ర సరికొత్త కారిడార్ నిర్మించాలని యోచిస్తోంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలను భారత్ తో కలపాలని భావిస్తోంది. పంజాబ్ లోని కర్తార్ పూర్ కారిడార్ తరహాలో శారదా పీఠ్ యాత్ర కోసం పీవోకే కారిడాన్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనిపై పాకిస్తాన్ తో చర్చించాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో టీత్వాల్ వద్ద ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ని తెరవాల్సి ఉంటుంది. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అప్పటి నుంచి నిరవధికంగా మూసేయబడింది. శ్రీనగర్-ముజఫరాబాద్ బస్సు సర్వీసును నిరవధికంగా నిలిపేశారు.
RAED ALSO: Ugadi Special : దేవుని కడపలో ఉగాది వేడుకలు.. పెద్ద ఎత్తున దర్శించుకున్న ముస్లింలు
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
బుధవారం కుప్వారా జిల్లాలోని తీత్వాత్ లోని శారదాదేవీ ఆలయాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ప్రకటన చేశారు. కిషన్ గంగా నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించారు. కర్తార్ పూర్ కారిడార్ తరహాలోనే యాత్రికుల కోసం శారదా పీఠాన్ని తెరవాలని రవీందర్ పండిత చెప్పారని, భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుందని, ఇందులో రెండో అభిప్రాయం లేదని ఆయన అన్నారు. ఈ కారిడార్ పై ఇరు దేశాలు చర్చిస్తే శారదా దేవిని దర్శించుకోవడం హిందూ భక్తులకు సులభం అవుతుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి.
శారదా ఆలయం ఎక్కడ ఉంది..?
పురాతన శారదా దేవాలయం, శక్తిపీఠంగా, విద్యా కేంద్రంగా ఉంది. పీవోకేలోని నీలం లోయలో ఉంది. ఇక్కడే శారదా నాగరికత, శారద లిపిని వెళ్లివిరిశాయి. ఈ ఆలయాన్ని 6 నుంచి 12 శతాబ్ధంలో నిర్మించారు. అవిభక్త భారతదేశంలో శక్తివంతమైన ఆలయంగా శారదా ఆలయం ఉండేది. కర్కోట వంశానికి చెందిన లలితాదిత్య ముక్తాపిద కాలంలో ఈ ఆలయాన్ని ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఆల్ బెరూనీ తన రచనల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావించాడు. దేవాలయంగా, ఓ విద్యాసంస్థగా శారదా ఆలయం ఉండేది.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!