Sharada Peeth: మన శారదా దేవీని దర్శించుకునే భాగ్యం దగ్గర్లోనే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు కారిడార్.. కేంద్రం యోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharada Peeth: హిందూ భక్తుల కోసం కేంద్ర సరికొత్త కారిడార్ నిర్మించాలని యోచిస్తోంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలను భారత్ తో కలపాలని భావిస్తోంది. పంజాబ్ లోని కర్తార్ పూర్ కారిడార్ తరహాలో శారదా పీఠ్ యాత్ర కోసం పీవోకే కారిడాన్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనిపై పాకిస్తాన్ తో చర్చించాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో టీత్వాల్ వద్ద ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ని తెరవాల్సి ఉంటుంది. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అప్పటి నుంచి నిరవధికంగా మూసేయబడింది. శ్రీనగర్-ముజఫరాబాద్ బస్సు సర్వీసును నిరవధికంగా నిలిపేశారు.
RAED ALSO: Ugadi Special : దేవుని కడపలో ఉగాది వేడుకలు.. పెద్ద ఎత్తున దర్శించుకున్న ముస్లింలు
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
బుధవారం కుప్వారా జిల్లాలోని తీత్వాత్ లోని శారదాదేవీ ఆలయాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ప్రకటన చేశారు. కిషన్ గంగా నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించారు. కర్తార్ పూర్ కారిడార్ తరహాలోనే యాత్రికుల కోసం శారదా పీఠాన్ని తెరవాలని రవీందర్ పండిత చెప్పారని, భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుందని, ఇందులో రెండో అభిప్రాయం లేదని ఆయన అన్నారు. ఈ కారిడార్ పై ఇరు దేశాలు చర్చిస్తే శారదా దేవిని దర్శించుకోవడం హిందూ భక్తులకు సులభం అవుతుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి.
శారదా ఆలయం ఎక్కడ ఉంది..?
పురాతన శారదా దేవాలయం, శక్తిపీఠంగా, విద్యా కేంద్రంగా ఉంది. పీవోకేలోని నీలం లోయలో ఉంది. ఇక్కడే శారదా నాగరికత, శారద లిపిని వెళ్లివిరిశాయి. ఈ ఆలయాన్ని 6 నుంచి 12 శతాబ్ధంలో నిర్మించారు. అవిభక్త భారతదేశంలో శక్తివంతమైన ఆలయంగా శారదా ఆలయం ఉండేది. కర్కోట వంశానికి చెందిన లలితాదిత్య ముక్తాపిద కాలంలో ఈ ఆలయాన్ని ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఆల్ బెరూనీ తన రచనల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావించాడు. దేవాలయంగా, ఓ విద్యాసంస్థగా శారదా ఆలయం ఉండేది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..