Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- విదేశీ టూర్ల కట్టడికి కేంద్రం ప్లాన్!
- భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం!
- కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లుగా వర్గాల సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. సంక్షోభం కారణంగా దేశాలు గజగజలాడుతున్నాయి. అన్ని దేశాలు పొదుపు మంత్రాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. అదే కోవలో భారత్ కూడా అమలు చేస్తోంది. ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందరూ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు.
ఇప్పుడు విదేశీ ప్రయాణాలను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధపడుతోంది. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సెస్ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని వర్గాల సమాచారం. విదేశీ ప్రయాణాలపై విధించే పన్ను, సెస్ లేదా సర్చార్జ్ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రాలకు పంచే డివిజిబుల్ పూల్లో ఈ నిధులు చేరవని సమాచారం. ఈ ప్రతిపాదనపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం ఈ అదనపు పన్ను తాత్కాలికంగా ఒక సంవత్సరం పాటు అమలులో ఉండే అవకాశం ఉంది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు, దిగుమతి వ్యయాలను తగ్గించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ప్రధాని మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం సూచించారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలు తగ్గించాలని, ఇంధన వినియోగాన్ని నియంత్రించాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో దేశ దిగుమతి భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 100 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది. ఫలితంగా విమాన టికెట్లు, హోటల్ ఖర్చులు, విదేశీ రవాణా వ్యయాలు భారీగా పెరిగాయి. ఇక భారత పర్యాటక రంగం ప్రస్తుతం 231.6 బిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద రంగంగా ఉంది. వచ్చే దశాబ్దంలో ఇది నాలుగో స్థానానికి చేరుకునే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు భారతీయుల విదేశీ పర్యటనల మార్కెట్ 2034 నాటికి 55.39 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ ప్రచారాన్ని మళ్లీ బలోపేతం చేసి విదేశీ పర్యాటకులను భారత్కు ఆకర్షించాలని పర్యాటక రంగ ప్రతినిధులు కేంద్రానికి సూచిస్తున్నారు. విదేశీ మారక నిల్వలను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్కే!
-
PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!